#FintechIndia

బీమా రంగంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలు బలహీనంగానే ఉన్నాయి: ప్రాక్సిస్ నివేదిక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 23 ,2026: కన్సల్టింగ్ సంస్థ 'ప్రాక్సిస్ గ్లోబల్  అలయన్స్' (Praxis Global Alliance) తాజా నివేదిక ప్రకారం, భారతదేశ జనరల్  ఇన్సూరెన్స్  (సాధారణ బీమా) రంగం కస్టమర్లతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడంపై కంటే వ్యాపార వృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అలాగే, మధ్యవర్తులపై ఆధారం పెరిగిపోతుండటం వల్ల కంపెనీల దీర్ఘకాలిక లాభాలు ఒత్తిడిలోకి వెళ్తున్నాయి. బీమా రంగంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మధ్యవర్తులపై ఎక్కువగా ఆధారపడుతుండటంపై ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని రోజులకే ఈ నివేదిక రావడం గమనార్హం. ప్రాక్సిస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో దాదాపు 80 శాతం బీమా వ్యాపారం ఇప్పటికీ ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్ భాగస్వామ్యాలు, ఓఈఎమ్ మాధ్యమాల వంటి మధ్యవర్తుల ద్వారానే జరుగుతోంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడానికి బీమా కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. ఫలితంగా వారికి భారీగా కమీషన్లు ఇస్తూ, కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలను కంపెనీలు కోల్పోతున్నాయి. Read this...

పేటీఎం లాభాల పంట: FY26లో Rs.552 కోట్ల నికర లాభం!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 7,2026: భారతదేశపు ప్రముఖ చెల్లింపులు ,ఆర్థిక సేవల పంపిణీ సంస్థ అయిన పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్...

కార్డ్ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను కలిసికట్టుగా ప్రవేశపెట్టిన ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్,పేయూ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్ , ఏప్రిల్ 28, 2026:భారతదేశానికి చెందిన ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో...

హైదరాబాద్‌లో సెకండ్ హ్యాండ్ కార్లకు ఫుల్ డిమాండ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 11,2026: భాగ్యనగరవాసులు పాత కార్ల కొనుగోలుపై అమితాసక్తి చూపుతున్నారు. నమ్మకం, పారదర్శకతతో కూడిన డిజిటల్ సేవలు అందుబాటులోకి...

సాంసంగ్ వాలెట్‌లో విప్లవాత్మక మార్పులు: యూపీఐ సెటప్, పిన్‌రహిత బయోమెట్రిక్ పేమెంట్లు ప్రవేశం..!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గురుగ్రామ్, నవంబర్ 4, 2025: భారతదేశంలోని అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా ఉన్న సాంసంగ్, తన సాంసంగ్...