పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభం,యోగా, సంగీత వేడుకలు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తూముకుంట, జూన్ 20, 2026 : విద్యార్థులు కేవలం మార్కుల వేటలో నే పడకుండా క్రీడలు, యోగా, నైతిక విలువలతో కూడిన సంపూర్ణ విద్యను అభ్యసించినప్పు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తూముకుంట, జూన్ 20, 2026 : విద్యార్థులు కేవలం మార్కుల వేటలోనే పడకుండా క్రీడలు, యోగా, నైతిక విలువలతో కూడిన సంపూర్ణ విద్యను అభ్యసించినప్పుడే సమున్నత వ్యక్తిత్వం సాధ్యమవుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.

తూముకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మైదానాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇదే వేదికపై అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను కూడా పాఠశాల యాజమాన్యం అత్యంత వైభవంగా నిర్వహించింది.

Read this also:Vi Strengthens Digital Footprint in Andhra Pradesh: 5G Services Now Live in Tirupati

Read this also:Kangaroo Kids Launches Screen-Free Summer Program ‘KanKamp 2026’..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. “క్రీడలు కేవలం వినోదం కోసం కాదు. పిల్లలను ఆధునిక వ్యసనాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచి శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి. మైదానంలోనే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమష్టి తత్వం అలవడతాయి.”

ఒత్తిడికి యోగాతో చెక్: “నేటి యాంత్రిక సమాజంలో పెరుగుతున్న ఆందోళనలను జయించడానికి విద్యార్థులకు యోగా, క్రీడలు ఎంతో అవసరం. మన ప్రాచీన గురుకుల విద్యా సంస్కృతి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచింది.”

ఉపాధ్యాయులకు కీలక సూచన: “ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్న తరుణంలో, పిల్లలకు తాతలు-నానమ్మల ప్రేమ, అనుభవ పాఠాలు దూరమవుతున్నాయి. ఆ లోటును భర్తీ చేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవన నైపుణ్యాలను నేర్పాలి.”

“పిల్లలు కేవలం ఒక కుటుంబ ఆస్తి కాదు, దేశ సంపద. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారత్‌కు ఈ విద్యార్థులే బలమైన పునాది.”- ఈటల రాజేందర్, ఎంపీ

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..

ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్రదర్శించిన క్లిష్టమైన ఆసనాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో జూన్ 21ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణమని, ప్రతి పాఠశాలలో దీనిని భాగం చేయాలని ఎంపీ కోరారు.

అనంతరం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా విద్యార్థుల గాన కచేరీలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఘనంగా కృతజ్ఞతా వందనం..

కార్యక్రమం ముగింపులో పాఠశాల ప్రిన్సిపాల్ డా. సుచరిత రాయ్ ముఖ్య అతిథి ఈటల రాజేందర్ గారికి, పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సరికొత్త ఫుట్‌బాల్ గ్రౌండ్, వేడుకలు విద్యార్థుల్లో సరికొత్త క్రీడా స్ఫూర్తిని, సృజనాత్మకతను నింపాయని పేర్కొన్నారు.

ఈ అట్టహాసమైన వేడుకల్లో డిపిఎస్ & పిజిఒఎస్ చైర్మన్ మల్కా కొమురయ్య, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డా. సంకూరి కార్తీక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author