#DirectToConsumer

బీమా రంగంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలు బలహీనంగానే ఉన్నాయి: ప్రాక్సిస్ నివేదిక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 23 ,2026: కన్సల్టింగ్ సంస్థ 'ప్రాక్సిస్ గ్లోబల్  అలయన్స్' (Praxis Global Alliance) తాజా నివేదిక ప్రకారం, భారతదేశ జనరల్  ఇన్సూరెన్స్  (సాధారణ బీమా) రంగం కస్టమర్లతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడంపై కంటే వ్యాపార వృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అలాగే, మధ్యవర్తులపై ఆధారం పెరిగిపోతుండటం వల్ల కంపెనీల దీర్ఘకాలిక లాభాలు ఒత్తిడిలోకి వెళ్తున్నాయి. బీమా రంగంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మధ్యవర్తులపై ఎక్కువగా ఆధారపడుతుండటంపై ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని రోజులకే ఈ నివేదిక రావడం గమనార్హం. ప్రాక్సిస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో దాదాపు 80 శాతం బీమా వ్యాపారం ఇప్పటికీ ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్ భాగస్వామ్యాలు, ఓఈఎమ్ మాధ్యమాల వంటి మధ్యవర్తుల ద్వారానే జరుగుతోంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడానికి బీమా కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. ఫలితంగా వారికి భారీగా కమీషన్లు ఇస్తూ, కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలను కంపెనీలు కోల్పోతున్నాయి. Read this...

వెండి ఆభరణాల రంగంలో ఏసీపీఎల్ సంచలనం:రూ.250 కోట్ల లక్ష్యంతో’ట్రూసిల్వర్’ లాంచ్!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఫిబ్రవరి 10,2026: వెండి ఆభరణాల తయారీ ,ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఏసీపీఎల్ ఎక్స్‌పోర్ట్స్ (ACPL Exports), దేశీయ వినియోగదారులకు...