2025 నూతన సంవత్సరానికి ప్రత్యేకంగా రూపొందించిన కేలండర్,డైరీ ఆవిష్కరణ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా రూపొందించిన కేలండర్,డైరీని ఆవిష్కరించారు. ఈ కేలండర్‌ను తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడమైన రాజ్యాంగ రచనలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, శాసన వ్యవస్థ అధికారిక ఖాతాలను సామాజిక మాధ్యమాలపై ప్రారంభించారు. ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్), YouTube (@Legis Andhra), Instagram, Facebook (@legisandhra) ద్వారా శాసనసభ కార్యకలాపాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రకటించారు. ఈ ప్రయత్నం శాసన వ్యవస్థ పనితీరును ప్రజలకు మరింత సులభతరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కూడా పాల్గొన్నారు.

About Author