పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పోచారం,జూలై 18,2026: హైదరాబాద్లోని పోచారం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ‘ఇన్వెస్టిచర్’
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పోచారం,జూలై 18,2026: హైదరాబాద్లోని పోచారం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ‘ఇన్వెస్టిచర్’ (బాధ్యతల స్వీకరణ) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన విద్యార్థి మండలి (స్టూడెంట్ కౌన్సిల్) ప్రతినిధులు ఈ సందర్భంగా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత కల్నల్ సతీష్ కుమార్ హాజరయ్యారు. భారత సైన్యంలో 35 ఏళ్ల పాటు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, సియాచిన్ వంటి క్లిష్ట ప్రాంతాలతో పాటు కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్న ఆయనను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.
Read this also..Vedanta Chairman Anil Agarwal Extends Greetings on the Auspicious Occasion of Jagannath Rath Yatra..
ఇదీ చదవండి :కాన్సెప్ట్తో ఆకట్టుకున్న యూత్ క్రైమ్ థ్రిల్లర్..మూవీ రిస్క్…
అనంతరం ఆయన విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, పాఠశాల పతాకాన్ని ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి :భద్రత, అవగాహన కోసం టాల్ రేడియో ఎస్ సి ఎస్ సి (SCSC) కీలక భాగస్వామ్యం..
Read this also..Instagram Content Trends 2026: The Formats and Styles Winning Right Now
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రభ్జోత్ కౌర్ అర్నేజా మాట్లాడుతూ.. ఈ ఏడాది విద్యార్థి మండలిని పూర్తిగా ఓటింగ్ విధానంలో ఎన్నుకున్నామని, తద్వారా విద్యార్థి దశలోనే వారిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పౌరసత్వం పట్ల అవగాహన పెంపొందుతుందని స్పష్టం చేశారు.

అనంతరం నూతన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం, మార్చ్పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు (శాస్త్రీయ నృత్యం, గానాలాపన) ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన:
“డీకార్బనైజ్ ఏషియా/పసిఫిక్” అంతర్జాతీయ పర్యావరణ ప్రాజెక్టులో భాగంగా కేంబ్రిడ్జ్ (స్టేజ్–5, 6) విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత్, ఫిలిప్పీన్స్, ఫిజీ, జపాన్, కెనడా దేశాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థులు తమ తాతయ్య, నానమ్మలతో వాతావరణ మార్పులపై చర్చించి ఆ విశేషాలతో కాన్వాస్ చిత్రాలు రూపొందించారు.
పారేసిన దాదాపు వెయ్యి విత్తనాలను సేకరించి, ఆశకు ప్రతీకగా బహుమతిగా అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
అనంతరం సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్, ఎర్లీ ఇయర్స్ విభాగాల హెడ్ బాయ్స్, హెడ్ గర్ల్స్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు నిజాయితీ, బాధ్యతలతో భవిష్యత్ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కల్నల్ సతీష్ కుమార్, డైరెక్టర్ సుశీల్ కుమార్ తదితరులు ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నాటారు. వందన సమర్పణ, జాతీయ గీతాలాపనతో ఈ వేడుకలు ముగిశాయి.