వైసీపీ నాయకులవి అన్నీ ‘ఫేక్’ బతుకులు: ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, మార్చి 5,2026: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేయగల వింత విద్య ఒక్క వైసీపీ నేతలకే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, మార్చి 5,2026: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేయగల వింత విద్య ఒక్క వైసీపీ నేతలకే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు.
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి..
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఎన్డీడీబీ (NDDB) నివేదికలు స్పష్టం చేశాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకు రూ. 12.5 కోట్లు, చెన్నైకి రూ. 7.5 కోట్లు చేరినట్లు సిట్ (SIT) దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
“బహిరంగ మార్కెట్లో వెన్న ధర రూ. 360 ఉంటే, కేవలం రూ. 316కే నెయ్యి ఎలా సరఫరా చేశారు?” అని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఈ మహాపాపానికి వైసీపీ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్వర్ల హ్యాకింగ్కు ప్రయత్నించినా ఏమీ దొరకలేదు..
గత ప్రభుత్వ హయాంలో తనను 33 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టి, సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ధూళిపాళ్ల గుర్తు చేశారు. అణువణువూ గాలించినా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారన్నారు. వెబ్సైట్లు డౌన్ చేయడం, మార్పింగ్లు చేయడం వైసీపీకి అలవాటైన విద్యని, వారివన్నీ ‘ఫేక్ బతుకులు’ అని మండిపడ్డారు.
Read this also:Grand Launch of ‘Souq-e-Deccan’ Expo in Hyderabad..
Read this also:LIET and IIUM unite to enhance International Academic exchange and Research Excellence
బొత్స, పేర్ని నానిలపై విమర్శల వర్షం..
బొత్స సత్యనారాయణ: శాసనమండలిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సమర్థించడం ద్వారా బొత్స దేవుడితో ఆటలాడుతున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.
పేర్ని నాని: “బియ్యం దొంగ పేర్ని నాని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రాత్రికి రాత్రి నేను వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేశానని ఆయన చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం” అని విమర్శించారు.
అవినీతి ఆరోపణలు – తప్పుడు కేసులు..
గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ తన సొంత మీడియా సంస్థలకు రూ. 307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చుకున్నారని, భారతీ సిమెంట్స్ ద్వారా 3 లక్షల టన్నుల సిమెంట్ను మాయం చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు. తనపై పెట్టిన 22 తప్పుడు కేసులను ప్రభుత్వం పరిశీలించి, వెంటనే ఎత్తివేయాలని కోరారు.
సంగం డెయిరీ నాణ్యతపై సవాల్..
సంగం డెయిరీ గుంటూరు రైతులదని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించేది తమ సంగం డెయిరీయేనని, ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.