పవన్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు: కటకటాల్లోకి..12 మంది..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పెనమలూరు, ఫిబ్రవరి 8,2026: చదువుల తల్లి ఒడిలో ఉండాల్సిన విద్యార్థిని తోటివారి వేధింపులు బలి తీసుకున్నాయి. పోరంకి శ్రీచైతన్య కళాశాలలో పవన్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పెనమలూరు, ఫిబ్రవరి 8,2026: చదువుల తల్లి ఒడిలో ఉండాల్సిన విద్యార్థిని తోటివారి వేధింపులు బలి తీసుకున్నాయి. పోరంకి శ్రీచైతన్య కళాశాలలో పవన్ కుమార్ బలవన్మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.
పవన్ ఆత్మహత్య చేసుకునే ముందు తనపై దాడి చేసిన వారి పేర్లను చేతిపై రాసుకోగా.. ఆ అక్షరాలను తుడిచేసి నిందితులను కాపాడాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రయత్నించడం విచారణలో వెల్లడైంది.

సంక్రాంతి సెలవులకు ముందు, తర్వాత కూడా పవన్పై కొందరు మైనర్ విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారని డీఎస్పీ తెలిపారు. ఆత్మహత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు కళాశాల సిబ్బంది ప్రయత్నించి నప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి.
Read this also:Godrej Security Solutions Eyes 20% Growth as Locker Demand Peaks..
Read this also:Re Sustainability and Janyu Technologies Forge Strategic Alliance to Automate High-Risk Waste Management..
ఈ క్రమంలో ప్రిన్సిపాల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్చార్జి రవీంద్ర, అధ్యాపకులు రాజేష్, ఆనంద్, కృష్ణలతో పాటు గొడవకు కారణమైన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ధ్యాపకులు, ఇతర సిబ్బంది ఉన్నారు.