వన్యప్రాణులను సంరక్షిస్తూనే అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలి:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి,సెప్టెంబర్ 26,2024: రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం రాత్రి క్యాంపు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి,సెప్టెంబర్ 26,2024: రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి కారిడార్లు, అభయారణ్యాల్లో వన్యప్రాణుల జీవనానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటి సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.

అదే విధంగా, ఈ కారిడార్ల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో, వన్యప్రాణి సంరక్షణతోపాటు, భారతమాల పరియోజన ద్వారా చేపట్టే నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం, షార్ సమీపంలో తీరప్రాంత రక్షణ, జెట్టీ నిర్మాణం, కడప – రేణిగుంట మధ్య రైల్వే లైన్ లో రోడ్లు నిర్మాణానికి సంబంధించి అనుమతులపై చర్చ జరిగింది.

ఈ అనుమతులు ఇవ్వడానికి అవసరమైన ఉపశమన ప్రణాళికలు పరిగణనలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుసరించిన విధానాలపై అధికారులు వివరించారు.

నేషనల్ టైగర్ కంజరేషన్ అథారిటీ,జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాల్లో అధ్యయనం చేసి తగిన ఉపశమన ప్రణాళికలు సూచించాల్సిన అవసరం ఉందని ఉల్లేఖించారు.

ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ,ఎ.కె. నాయకు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author