ఏపీలో1000 స్టోర్లతో సరికొత్త రికార్డు మైలురాయిని చేర్చుకున్న అపోలో ఫార్మసీ..
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2026 : ఆంధ్రప్రదేశ్లో అపోలో ఫార్మసీ తన…
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2026 : ఆంధ్రప్రదేశ్లో అపోలో ఫార్మసీ తన నెట్వర్క్ను మరింత విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి స్టోర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా.. విశాఖపట్నంలో 1000వ మైలురాయి కేంద్రాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఇదీ చదవండి..హైదరాబాద్లో భారీగా విస్తరించిన యూబిఎస్ (UBS)గచ్చిబౌలిలో నూతన కార్యాలయం ప్రారంభం…
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ (ఐపీఎస్) ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ నూతన స్టోర్ను ప్రారంభించగా.. సంస్థ సీఈఓ పి.జయకుమార్, సీఓఓ బాలమురుగన్ పాల్గొన్నారు.

సేవలే లక్ష్యంగా..
ప్రస్తుతం ఏపీలోని 15 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన సేవలను విస్తరించింది. సుమారు 7 వేల మందికి పైగా సిబ్బందితో, 50 వేల రకాల నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రజలకు చేరువయ్యేలా మెజారిటీ స్టోర్లను 24 గంటల పాటు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read this also:HDFC Balanced Advantage Fund Marks 32-Year Milestone with 18% CAGR..
మరో 150 కొత్త స్టోర్లు..
రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మరో 150 కొత్త విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఈఓ పి.జయకుమార్ వెల్లడించారు. రోగులకు నాణ్యమైన మందులతో పాటు సత్వర సేవలు అందించడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. అపోలో 24/7 ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ వైద్య సంప్రదింపులు, డయాగ్నస్టిక్ పరీక్షలు, బీమా సదుపాయాలను ఇంటి వద్దకే చేరవేస్తున్నట్లు వివరించారు.