ఆమ్నియల్ ఫార్మాలో కేంద్ర కార్యదర్శి పర్యటన..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అహ్మదాబాద్, 16సెప్టెంబర్ , 2026: కేంద్ర ఫార్మా స్యూటికల్స్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అహ్మదాబాద్లోని ‘ఆమ్నియల్ ఫార్మాస్యూటికల్స్’ కార్పొరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అహ్మదాబాద్, 16 సెప్టెంబర్ , 2026: కేంద్ర ఫార్మా స్యూటికల్స్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అహ్మదాబాద్లోని ‘ఆమ్నియల్ ఫార్మాస్యూటికల్స్’ కార్పొరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు.
ఇదీ చదవండి:టైమ్ యొక్క అమెరికాస్ బెస్ట్ కంపెనీస్ 2026 జాబితాలో స్థానం పొందిన కాగ్నిజెంట్..
ఇదీ చదవండి:స్విగ్గీ డైన్అవుట్ GIRF సరికొత్త ప్రచారం: రవి కిషన్తో ‘ది గ్రేట్ ఇండియన్ రవి ఫెస్టివల్’..
ఇదీ చదవండి:జావా ఆల్ స్టార్స్ ‘సిల్వర్ నైట్’ విజేతగా స్టావ్రౌలా..
ఈ సందర్భంగా దేశీయ ఔషధ తయారీ, నూతన ఆవిష్కరణల్లో ఆ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంస్థ ప్రతినిధులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, విస్తరణ సామర్థ్యాలపై ఆయన కీలక చర్చలు జరిపారు.
విస్తరిస్తున్న సామర్థ్యాలు..
కాశివ్ బయోసైన్సెస్ను ఇటీవల కొనుగోలు చేయడం ద్వారా ఆమ్నియల్ తన బయోసిమిలార్స్, పరిశోధన-అభివృద్ధి (R&D), సంక్లిష్ట ఔషధాల తయారీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుందని సంస్థ ప్రతినిధులు కార్యదర్శికి వివరించారు.
ఈ కలయికతో పరిశోధన, వాణిజ్యీకరణ రంగాల్లో ప్రపంచ స్థాయి బయోసిమిలార్స్ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంప్లెక్స్ జెనరిక్స్, ఇంజెక్టబుల్స్, ఏపీఐల తయారీ ద్వారా భారత ఫార్మా రంగానికి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆవిష్కరణలకు పెద్దపీట..
దేశీయ ఔషధ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం, బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి రూ.10,000 కోట్లతో ప్రతిపాదించిన ‘బయోఫార్మా శక్తి’ కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరమని ఇరు వర్గాలు అభిప్రాయపడ్డాయి.
నైపుణ్యం కలిగిన మానవ వనరుల ఆవశ్యకత..

డాక్టర్ పార్వ పురోహిత్ (ఆమ్నియల్ ఆర్&డీ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్): “ఔషధ తయారీలో భారత్కు బలమైన పునాది ఉంది. బయోఫార్మా ఆవిష్కరణల్లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. సంక్లిష్ట ఔషధాలు, బయోసిమిలార్స్ రంగాల్లో మా సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నాం.”
“ఫార్మా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉంది. పరిశ్రమకు అవసరమైన యువతను తయారు చేయడానికి ప్రభుత్వ సహకారం, విద్యాసంస్థల భాగస్వామ్యం ఎంతో కీలకం. మనోజ్ జోషి గారితో జరిగిన చర్చలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.” -రాహుల్ మైత్రా,హెచ్ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్.