కరణ్ జోహర్ త్యానీ జ్యువెలరీ ప్రచార సారధిగా షెఫాలీ షా..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి, జూన్ 3,2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహర్ తన తాజా ప్రచార కార్యక్రమం ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి, జూన్ 3,2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహర్ తన తాజా ప్రచార కార్యక్రమం ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ నటి షెఫాలీ షాను తమ తొలి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది.
ఇది దశలవారీగా సాగనున్న ఈ ప్రచారం ద్వారా 10 మందికి పైగా వ్యక్తిత్వం గల మహిళలను ప్రచార ముఖాలుగా పరిచయం చేయనున్నారు. ప్రతి వారంలో ఒకరు చొప్పున కొత్త ప్రచారకర్తను బ్రాండ్ ప్రకటించనుంది. తమ ప్రత్యేక శక్తిని వెలిగించగలిగే మహిళలతో ఈ ప్రచారం కొనసాగనుంది.
ప్రచారంలో తొలి విడతగా విడుదలైన షెఫాలీ షా విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బంగారం, విలువైన రత్నాలు, కట్,అన్కట్ వజ్రాలతో రూపొందించిన త్యానీ నెక్లెస్ ధరించిన ఆమె శక్తివంతమైన కథనంతో కనిపించారు. ఈ ప్రచారం మహిళలు తమ అంతర్గత బలాన్ని, సౌందర్యాన్ని విశ్వాసంతో స్వీకరించేందుకు ప్రేరణనిస్తుంది.
ఈ సందర్భంగా త్యానీ వ్యవస్థాపకుడు కరణ్ జోహర్ మాట్లాడుతూ, “ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ మా బ్రాండ్ విలువలకు ప్రతిబింబం. ఇది విలాసానికి కొత్త నిర్వచనం ఇస్తోంది. వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ప్రామాణికతను ఆధారంగా చేసుకుని త్యానీ రూపుదిద్దుకుంది. షెఫాలీ షాను త్యానీ కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది” అని తెలిపారు.
ఇది కూడా చదవండి…రూ.300 కోట్ల అంచనా ఆదాయంతో వుడ్స్ ఫేజ్-II ఆరంభం
Read This also…IndiGo and Garuda Indonesia Forge Codeshare Partnership to Boost Connectivity Between India and Indonesia
రియల్ ఉమెన్, రియల్ స్టోరీస్, రియల్ జ్యువెలరీ అనే భావనతో రూపొందిన ఈ ప్రచారం ఒక సాధారణ ప్రచార కార్యక్రమం కాదు, ఒక సాంస్కృతిక ఉద్యమం. ప్రతి ఆభరణం ఒక వ్యక్తిగత కథను వినిపిస్తుంది. పనితనం, భావం, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది.
త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్ ప్రస్తుతం ఏడు నగరాల్లో – ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, లక్నో, చండీగఢ్లో ఉంది. ఈ బ్రాండ్ జూన్ 8న అహ్మదాబాద్లో తన మొదటి స్టోర్ను కూడా ప్రారంభించనుంది. వినియోగదారులు tyaani.com లో ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయవచ్చు.