మహా కుంభమేళా లో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం – సనాతన ధర్మం వికాసం పై ప్రసంగం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 19,2025: వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతోందని చరిత్ర చెబుతోంది. “నేను గతంలో యోగి ఆత్మకథ అనే పుస్తకం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 19,2025: వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతోందని చరిత్ర చెబుతోంది. “నేను గతంలో యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతుండగా అందులో కుంభమేళా గురించి వివరించిన అంశాలు చదివాను. గత మూడు దశాబ్దాలుగా ఈ మహా మేళాను గమనిస్తున్నాను.
ప్రతిసారీ హాజరయ్యేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు మహా కుంభమేళాలో పాల్గొనడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది,” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇది కూడా చదవండి..సుధీర్ బాబు హీరోగా‘జటాధర’ చిత్రం ప్రారంభం
Read this also...Magellanic Cloud Accelerates AI-Led Growth, Expands Operations in Telangana
మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల హాజరై పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమానికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా అకీరా నందన్, త్రివిక్రమ్, ఆనంద సాయి కూడా పుణ్యస్నానం ఆచరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నారు – “భారతదేశం వివిధ జాతులు, తెగలు, సంప్రదాయాలతో విభిన్నమైన దేశంగా ఉన్నప్పటికీ, సనాతన ధర్మం విషయంలో అందరూ ఏకమవుతారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో ఎలా కనిపిస్తుందో, సనాతన ధర్మంలోనూ అదే విధంగా కనిపిస్తుంది.
వేల ఏళ్లుగా సనాతన ధర్మం వికసిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలి. దేశంలోని సగానికి పైగా జనాభా కుంభమేళాలో పాల్గొనడం గొప్ప విశేషం. ప్రపంచంలో ఇంత భారీ స్థాయిలో జరిగే ధార్మిక కార్యక్రమం మరెక్కడా లేదు.
Read this also...Bank of India Raises Rs.2,690 Crore through 10-Year Infrastructure Bonds at 7.50% Interest
ఇది కూడా చదవండి..మాజిల్లానిక్ క్లౌడ్ టెక్నాలజీ విస్తరణ.. తెలంగాణలో భారీ పెట్టుబడులు
కుంభమేళాను సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావించవచ్చు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానం ఆచరించి వెళ్ళడం అద్భుతం.”
మహా కుంభమేళా: ప్రణాళికాబద్ధ ఏర్పాట్లు, కొన్ని దురదృష్టకర సంఘటనలు
50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించిన మహా కుంభమేళాలో కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్– “సనాతన ధర్మాన్ని పాటించే వారి మీద, ఆ ధర్మాన్ని నమ్మే భక్తులపై కొన్ని రాజకీయ నాయకులు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమే.

మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోంది. ఇంత భారీ స్థాయిలో భక్తులు కూడినప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరగొచ్చు. కానీ ఈ ఘటనలను సనాతన ధర్మం మీద నింద వేయడం సబబు కాదు.
ఇతర మత ధార్మిక కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరిగితేనూ రాజకీయ నేతలు ఇలానే స్పందించేవారా?” అని ప్రశ్నించారు.
“ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కేవలం సనాతన ధర్మం మీదే మాటలు రావడం కరెక్టు కాదు. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో కూడా పక్కా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఒక్కసారిగా వచ్చిన భక్తుల కదలిక వల్ల అపశృతి చోటుచేసుకుంది.
ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా పరిస్థితిని అర్థం చేసుకొని స్పందించాలి. సనాతన ధర్మాన్ని నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యానించడం శ్రేయస్కరం కాదు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.