హైదరాబాద్‌లో మిచెలిన్ మరింత బలోపేతం – రెండు కొత్త ప్రీమియం స్టోర్లు ప్రారంభం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 18,2025: ప్రపంచ ప్రముఖ టైర్ తయారీ సంస్థ మిచెలిన్ ఇండియా… నగరంలో తన పట్టు మరింత గట్టిగా చేసింది. బంజారాహిల్స్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 18,2025: ప్రపంచ ప్రముఖ టైర్ తయారీ సంస్థ మిచెలిన్ ఇండియా… నగరంలో తన పట్టు మరింత గట్టిగా చేసింది. బంజారాహిల్స్, కొల్లూరులో రెండు కొత్త మిచెలిన్ టైర్స్ & సర్వీసెస్ (ఎంటీఎస్) స్టోర్లను ఘనంగా ప్రారంభించింది. ఇవి యథాక్రమం అశోక వీల్స్, 4 వీల్జ్ & టైర్స్‌తో భాగస్వామ్యంలో ఏర్పాటయ్యాయి.

ఈ రెండు స్టోర్ల ప్రారంభంతో హైదరాబాద్‌లో మిచెలిన్ మొత్తం స్టోర్ల సంఖ్య 5కి చేరింది. లగ్జరీ, ప్రీమియం కార్ల యజమానులు పెరుగుతున్న నగరంలో వినియోగదారులకు మరింత సమీపంగా ఉండాలన్న వ్యూహంలో భాగంగానే ఈ విస్తరణ జరిగింది.

కొత్త స్టోర్లలో అత్యాధునిక సాంకేతికతలతో కూడిన పరికరాలు ఉన్నాయి. వీల్ అలైన్‌మెంట్, రోడ్ ఫోర్స్ బ్యాలెన్సింగ్, నైట్రోజన్ ఇన్‌ఫ్లేషన్, ప్రీమియం టైర్ ఫిట్‌మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయి. మిచెలిన్ పూర్తి ప్రీమియం టైర్ రేంజ్ కూడా ఇక్కడే లభిస్తుంది.

స్టోర్లను మిచెలిన్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ ప్రశాంత్ శర్మ లాంఛనంగా ప్రారంభించారు.

మిచెలిన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శంతను దేశ్‌పాండే మాట్లాడుతూ… “దక్షిణ భారతంలో హైదరాబాద్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్. లగ్జరీ, ప్రీమియం వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో రెండు కొత్త స్టోర్లు ప్రారంభించడం మా నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాదు… వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలు అందించే మా నిబద్ధతకు నిదర్శనం. చెన్నైలో మా కొత్త ప్యాసింజర్ కార్ టైర్ ప్లాంట్ ద్వారా ‘మేడ్ ఇన్ ఇండియా’ టైర్ల తయారీ కూడా వేగం పుంజుకుంటోంది” అని తెలిపారు.

ఈ విస్తరణతో మిచెలిన్ ఇండియా… దేశవ్యాప్తంగా తన ప్రీమియం టచ్‌పాయింట్ల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది.

About Author