26న జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు
వారాహి డాట్ కామ్ ఆన్ లనే న్యూస్, సెప్టెంబర్ 21,2024:జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.

వారాహి డాట్ కామ్ ఆన్ లనే న్యూస్, సెప్టెంబర్ 21,2024:జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య,జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో జనసేనలో చేరేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ సమయంలో, వీరు ఇప్పటికే మూడు వారులుగా వేరువేరుగా పవన్ కల్యాణ్ తో సమావేశమై, పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. అదే రోజున విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, డా. అవనపు భావన కూడా జనసేనలో చేరనున్నట్టు సమాచారం. వైసీపీ యూత్ జోనల్ ఇంచార్జ్గా ఉన్న అవనపు విక్రమ్, విజయనగరం, పార్వతీపురం జిల్లాల డి.సి.ఎం.ఎస్. చైర్ పర్సన్గా ఉన్న డా. భావన జనసేనలో చేరనున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డా. యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్.పి.టి.సి. డా. యాదాల రత్నభారతి కూడా జనసేనలో చేరతారు.

అంతేకాదు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరుతారని సమాచారం. శనివారం మధ్యాహ్నం, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో కిలారి రోశయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. అనంతరం, సామినేని ఉదయభాను కూడా భేటీ అయ్యారు.