ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ
వారాహి డాట్ కామ్ ఆన్ లనే న్యూస్, సెప్టెంబర్ 21,2024:వరదలతో అతలాకుతల మైన ప్రాంతాల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి

వారాహి డాట్ కామ్ ఆన్ లనే న్యూస్, సెప్టెంబర్ 21,2024:వరదలతో అతలాకుతల మైన ప్రాంతాల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యం లో, శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 విలువైన చెక్కును అందించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బి.యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు దొర,ఇతరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శి వడ్రాణమ్ మార్కండేయ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,ఆయన సతీమణి వెంకట లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. వారి నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళాన్ని కూడా సహాయ నిధికి అందించారు. ఈ చెక్కులను పవన్ కల్యాణ్ అందించారు.
ప్రముఖ యువ నటుడు ఆది, గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షల విరాళం అందించారు. వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఎ.కె. మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.1 లక్ష, తన స్వగ్రామమైన పల్లామల్లి (ప్రకాశం జిల్లా) పంచాయతీకి రూ.2 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా, ఆది మాట్లాడుతూ, “వరదలతో తీవ్రమైన పరిస్థితులలో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరినీ స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలుసుకుని, నా వంతుగా రూ.3 లక్షలు అందించాను” అని తెలిపారు.