ఐపీవో లక్ష్యంగా ముందడుగులు వేసిన ‘ఈక్వస్’: కాన్ఫిడెన్షియల్‌ గా సెబీకి దాఖలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 4,2025: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ‘ఈక్వస్ లిమిటెడ్’ (Aequs Limited) తమ మొదటి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 4,2025: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ‘ఈక్వస్ లిమిటెడ్’ (Aequs Limited) తమ మొదటి పబ్లిక్ ఇష్యూ (IPO) కోసం కావలసిన ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2025 జూన్ 3న గోప్యంగా దాఖలు చేసింది.

ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ, “ఈక్వస్ ప్రైవేట్ లిమిటెడ్” నుంచి “ఈక్వస్ లిమిటెడ్”గా మారింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ మార్పుకు ఇటీవల ఆమోదం తెలిపింది.

$200 మిలియన్ విలువైన ఐపీవో?

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈక్వస్ సుమారు $200 మిలియన్ల విలువగల ఐపీవోకు సన్నద్ధమవుతోంది. ఇందులో ఫ్రెష్ ఈష్యూ తో పాటు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగం కూడా ఉంటుంది. అయితే, కంపెనీ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించింది.

ఈ ఐపీవోకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

Read This also…Aequs Files Confidential DRHP with SEBI, Eyes $200 Million IPO

Read This also…Sanwariya Education Consultant Hosts Grand Celebration Fest in Hyderabad to Mark BPP University’s No.1 Student Support Ranking

గ్లోబల్ ఇన్వెస్టర్ల మద్దతుతో ముందుకు సాగుతున్న ఈక్వస్

ప్రారంభం నుండి ఈక్వస్ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రమోటర్లు భారీగా మూలధనం జత చేశారు. అలాగే ఎమికస్ క్యాపిటల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, కాటమారన్ (నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్), దేశ్ దేశ్‌పాండే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల మద్దతు కూడా లభించింది. పీఈ ఇన్వెస్టర్ల నుంచి రూ.586 కోట్లకు పైగా CCPS రూపంలో నిధులను సమీకరించగా, వీటిని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నారు.

వృద్ధి పథంలో వ్యాపారం

2024 ఆర్థిక సంవత్సరానికి ఈక్వస్ మొత్తం ఆదాయం రూ.988 కోట్లు కాగా, నిర్వహణ ఆదాయం రూ.970 కోట్లు. కేర్ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం, కంపెనీ ఆదాయం మధ్య కాలంలో 45% CAGRతో పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ విస్తరణ & యాపిల్ భాగస్వామ్యం

ఈక్వస్ ఇండియా, ఫ్రాన్స్, అమెరికాలో తయారీ కేంద్రాలతో గ్లోబల్ ఖాతాదారులకు సేవలందిస్తోంది. కర్ణాటకలో బెల్గావి, హుబ్బళ్లి, కొప్పల్‌లో మూడు క్లస్టర్లు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్, జాబిల్‌లతో కలిసి యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాల తయారీకి ఈక్వస్ కూడా భాగస్వామిగా నిలుస్తోంది.

Read This also…IndiGo and Garuda Indonesia Forge Codeshare Partnership to Boost Connectivity Between India and Indonesia

నాయకత్వం

కంపెనీ వ్యవస్థాపకుడు అరవింద్ మెలిగెరి చైర్మన్‌గా, రాజీవ్ కౌల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, జీన్ మిచెల్ కొండామిన్ ఏరోస్పేస్ డివిజన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

About Author