ఫ్లిప్‌కార్ట్ ‘బ్యాక్ టు క్యాంపస్’ 2026 సేల్ తో విద్యార్థులకు అదిరే టెక్ డీల్స్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 27,2026: ఫ్లిప్‌కార్ట్, భారతదేశానికి చెందిన స్వదేశీ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్, తన ప్రతిష్ఠాత్మకమైన ‘బ్యాక్ టు క్యాంపస్’ 2026 సేల్‌ను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 27,2026: ఫ్లిప్‌కార్ట్, భారతదేశానికి చెందిన స్వదేశీ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్, తన ప్రతిష్ఠాత్మకమైన ‘బ్యాక్ టు క్యాంపస్’ 2026 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ మే 22 నుంచి మే 28 వరకు కొనసాగుతుంది.

విద్యార్థులు చదువు, సృజనాత్మకత, సహకార అధ్యయనం,రోజువారీ ఉత్పాదకత కోసం డిజిటల్-ఫస్ట్ ,ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో, విద్యా సీజన్‌లో సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడం,సరసమైన ధరల్లో అందించడం ద్వారా ఈ మారుతున్న అవసరాలకు మద్దతు ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సేల్‌లో ఏఐ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఆడియో పరికరాలు వంటి విభిన్న ఉత్పత్తుల విస్తృత ఎంపికను వినియోగదారులకు అందిస్తున్నారు. వినియోగదారులు ఆసుస్, ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్, శామ్‌సంగ్, లెనోవో, మోటరోలా, హెచ్‌పీ, డెల్, ఏసర్, యాపిల్, వన్‌ప్లస్, సోనీ, జేబీఎల్, బోట్, నాయిస్, రియల్‌మీ, తదితర ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.

Read this also..Flipkart Brings Student-Focused Tech Deals with ‘Back to Campus’ 2026 sale

Read this also..NAREDCO Telangana & ESCI Partner to Train Future Real Estate Talent..

అదనంగా, ఇటీవల విడుదలైన యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5, శామ్‌సంగ్ గెలాక్సీ బుక్6, ఆసుస్ వివోబుక్ 14 కోర్ అల్ట్రా సిరీస్ 3, ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా, లెనోవో లీజియన్ ప్రో 5, యాపిల్ మ్యాక్‌బుక్ నియో, వన్‌ప్లస్ ప్యాడ్ 4, ఏసర్ ఐకోనియా ట్యాబ్ 5జీ వంటి తాజా పరికరాలతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఇతర కొత్త డివైస్‌లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్లో ఎలక్ట్రానిక్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ సుజిత్ అగాషే మాట్లాడుతూ, “ప్రస్తుతం ఏఐ ఆధారిత ప్రపంచంలో భవిష్యత్‌కు సిద్ధమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సాంకేతికతే పునాది. ‘బ్యాక్ టు క్యాంపస్’ 2026 ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అధిక పనితీరు కలిగిన, ఏఐ సదుపాయాలతో కూడిన పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సరసమైన ధరల్లో అందిస్తున్నాం.

స్మార్ట్ కంప్యూటింగ్ పరికరాల ఎంపికను అనువైన ఫైనాన్సింగ్ సౌకర్యాలతో కలిపి అందించడం ద్వారా ప్రతి విద్యార్థి తమ విద్యా లక్ష్యాలను సాధించేందుకు, డిజిటల్ భవిష్యత్తులో రాణించేందుకు అవసరమైన సరైన సాంకేతికతను పొందేలా చేస్తున్నాం” అని తెలిపారు.

Read this also..Amazon launches Echo Dot Max and Echo Studio featuring premium audio and new modern design..

Read this also..Banning a pesticide will not stop farmer suicides. Need science-based approach to address the root cause: CropLife India..

అదనపు ప్రయోజనాలు,ప్రత్యేక ఆఫర్లను పొందేందుకు, విద్యార్థులు ధృవీకరించిన స్టూడెంట్ ఐడీతో ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్స్ క్లబ్ లో నమోదు చేసుకోవచ్చు. ద్వారా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై రూ. 6,000 వరకు అదనపు తగ్గింపులు పొందడంతో పాటు, రోజుకు కేవలం రూ. 200 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను 24 నెలల వరకు వినియోగించుకోవచ్చు. అలాగే ప్రముఖ ల్యాప్‌టాప్ బ్రాండ్లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ‘బ్యాక్ టు క్యాంపస్’ సేల్‌ను మరింత ఆకర్షణీయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నమైన కొత్త యాడ్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. “అద్భుతమైన ఆఫర్లతో మీ గ్యాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేసుకుని, స్టైల్‌గా మళ్లీ క్యాంపస్‌కు వెళ్లండి” అనే సరదా కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ప్రచారం ద్వారా, విద్యార్థులు తిరిగి క్యాంపస్‌కు వెళ్లే ముందు మరింత తెలివైన టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ మార్కెటింగ్ అండ్ గ్రోత్ విభాగ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ శెట్టి మాట్లాడుతూ, “ఈ ఏడాది ‘బ్యాక్ టు క్యాంపస్’ సేల్‌ను అద్భుతమైన ఆఫర్లతో పాటు భారతీయ విద్యార్థులందరికీ సుపరిచితమైన అనుభవాలను గుర్తు చేసే భావోద్వేగాలతో రూపొందించాము.

విలువ,సాంస్కృతిక నాస్టాల్జియా కలయికతో రూపొందించిన ఈ ప్రచారం ద్వారా పోటీ ప్రకటనల మధ్య ప్రత్యేక గుర్తింపును పొందడంతో పాటు యువతతో నిజమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగాము” అని తెలిపారు.

About Author