శ్రీవారికి రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్ 3,2025: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ. కోటి విరాళం సమర్పించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్ 3,2025: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ. కోటి విరాళం సమర్పించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. తిరుమలలో విశేష ఉత్సవాలు జరిగే రోజులను మినహాయించి, విరాళం ఇచ్చిన భక్తులు ఈ ప్రత్యేక సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.

రూ. కోటి విరాళం సమర్పించే దాతలకు జీవితకాలంలో, వారి కుటుంబంలోని నలుగురికి ప్రతి ఏడాది కింది ప్రత్యేక దర్శన, సేవా సౌకర్యాలు లభిస్తాయి:
సుప్రభాత సేవ – 3 రోజులు
బ్రేక్ దర్శనం – 3 రోజులు
సుపథం ప్రవేశ దర్శనం – 4 రోజులు

ఇతర ప్రత్యేక సదుపాయాలు

🔹 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు
🔹 ఒక దుప్పటి, ఒక రవికే
🔹 10 మహా ప్రసాదం ప్యాకెట్లు
🔹 వేద ఆశీర్వచనం (ఒకసారి)
🔹 రూ. 3,000 విలువైన వసతి గదులు (3 రోజులు)

అంతేకాక, జీవితకాలంలో ఒకసారి భక్తుడు తగిన ఆధారాలు చూపించి 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్ పొందే అవకాశం కల్పించారు.

దాతలు టిటిడి నడుపుతున్న వివిధ ట్రస్టులకు విరాళాలు అందించి, ఈ ప్రత్యేక సౌకర్యాలను పొందవచ్చు. వీటిలో ముఖ్యమైనవి:
🔸 కాటేజ్ డొనేషన్ స్కీం
🔸 శ్రీ వేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్
🔸 శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్
🔸 శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్
🔸 శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్
🔸 శ్రీవాణి ట్రస్ట్
🔸 శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (SWIMS)

భక్తులు తమ శ్రద్ధానుసారం విరాళాలు సమర్పించి, తిరుమలలో ప్రత్యేక సేవలు పొందవచ్చు.

దాతలు టిటిడి వెబ్ సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాలి.

About Author