రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ‘స్ట్రింగ్ మెటావర్స్’..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 25, 2026: డిజిటల్,ఏఐ ఆధారిత ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ సంస్థ ‘స్ట్రింగ్ మెటావర్స్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 25, 2026: డిజిటల్,ఏఐ ఆధారిత ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ సంస్థ ‘స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్’, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తన ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది.
ఏఐ మౌలిక సదుపాయాలు, గేమింగ్ ఎకోసిస్టమ్స్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వంటి ప్రధాన వ్యాపార విభాగాల్లో సాధించిన అద్భుతమైన వృద్ధితో కంపెనీ అత్యుత్తమ పనితీరును కనబరిచింది. తద్వారా తన వృద్ధి ప్రయాణంలో సరికొత్త ఆర్థిక మైలురాళ్లను నెలకొల్పింది. మే 25, 2026న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ ఏకీకృత ఆర్థిక ఫలితాలకు అధికారికంగా ఆమోదం లభించింది.
అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు (ఎఫ్వై 26):
గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై25) రూ. 407.36 కోట్లుగా ఉన్న కంపెనీ నిర్వహణాదాయం, ఈ పూర్తి ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై26) ముగిసేనాటికి భారీగా పెరిగి ఏకంగా రూ. 1,069.11 కోట్లకు ఎగబాకింది. ఈ అద్భుతమైన ఆదాయ వృద్ధి (టాప్-లైన్ గ్రోత్) సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇదీ చదవండి :వైజాగ్లో ప్రోటీన్ డైట్ ట్రెండ్.. హెల్తీ ఫుడ్కు పెరిగిన డిమాండ్..
ఇదీ చదవండి :హైదరాబాద్కు ‘ఊట’.. భాగ్యనగర వాసులకు పరిచయం కానున్న స్థానిక రుచులు..
కంపెనీ పన్నుకు ముందు లాభం (పిబిటి) రూ. 103.51 కోట్లుగా నమోదు కాగా, పన్ను తర్వాతి నికర లాభం (పిఎటి) ఒక మైలురాయిని దాటి రూ. 102.52 కోట్లకు చేరింది. కార్యాచరణ సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడి, నిర్వహణ లాభం (ఈబిడిఐటి) వార్షిక ప్రాతిపదికన 190 శాతం దూసుకెళ్లి రూ. 121.88 కోట్లకు పెరిగింది. ఫలితంగా, వాటాదారుల ఆర్జన (ఇపిఎస్) సైతం 170 శాతం వృద్ధితో రూ. 0.89గా నమోదైంది.
నాలుగో త్రైమాసికంలోనూ అదే జోరు:
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ కంపెనీ తన వృద్ధి వేగాన్ని అలాగే కొనసాగించింది. ఈ నాలుగో త్రైమాసికంలోనే స్ట్రింగ్ మెటావర్స్ రూ. 359.40 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. త్రైమాసికాల ప్రాతిపదికన చూస్తే ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం (ఈబిడిఐటి) 167 శాతం వృద్ధితో రూ. 41.98 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇక ఈ త్రైమాసిక నికర లాభం (పిఎటి) రూ. 34.71 కోట్లుగా నమోదైంది.
వ్యూహాత్మక ప్రపంచవ్యాప్త విస్తరణ, భవిష్యత్ ప్రణాళికలు:
అంతర్జాతీయ మార్కెట్లు అత్యంత వేగంగా ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏజెంటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అసెట్స్, వెబ్3 టోకనైజేషన్, అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల వైపు మళ్లుతున్న తరుణంలో.. స్ట్రింగ్ మెటావర్స్ ఆయా రంగాలకు కేంద్ర బిందువుగా వ్యూహాత్మకంగా తనను తాను మలచుకుంటోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా, స్ట్రింగ్ మెటావర్స్ తన అంతర్జాతీయ కార్యకలాపాలను ముమ్మరంగా విస్తరిస్తోంది.
ఇదీ చదవండి :మమ్ముట్టి, మోహన్ లాల్ ‘పేట్రియాట్’.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
Read this also..Mammootty & Mohanlal’s Patriot Sets ZEE5 Digital Premiere on June 5..
ఇండియా, యూఏఈ, హాంగ్ కాంగ్, సింగపూర్, కెనడా వంటి కీలక అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ, గేమింగ్, డిజిటల్ ఆస్తులు, ఆల్గారిథమిక్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
ఈ రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలపై స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గణేష్ మీనవల్లి స్పందిస్తూ.. “ఏఐ ఆధారిత ఆర్థిక మౌలిక సదుపాయాలు, గేమింగ్ ఎకోసిస్టమ్స్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ టెక్నాలజీల వైపు మా విస్తరణను మరింత వేగవంతం చేసిన ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరం, ‘స్ట్రింగ్ మెటావర్స్’ ప్రయాణంలో ఒక చరిత్రాత్మక పరివర్తనకు నాంది పలికింది” అని హర్షం వ్యక్తం చేశారు.

ఆడిట్ నివేదిక అప్డేట్:
కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్లు ఆర్థిక నివేదికలను సమీక్షించి, ఎటువంటి మార్పులు లేని ఆడిట్ అభిప్రాయాన్ని జారీ చేశారు. సంస్థ పటిష్టమైన ఆర్థిక స్థితికి, పారదర్శకమైన రిపోర్టింగ్ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోంది.
భవిష్యత్ అంచనాలకు సంబంధించిన నిరాకరణ:
ఈ పత్రికా ప్రకటనలో పేర్కొన్న భవిష్యత్ అంచనాలు, వ్యాపార లావాదేవీలు కొన్ని రకాల రిస్క్లు, అనిశ్చితులకు లోబడి ఉంటాయి. వాస్తవ ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉండవచ్చు. వర్తించే చట్టాలకు లోబడి మినహా, ఇలాంటి ప్రకటనలను పబ్లిక్గా అప్డేట్ చేసే బాధ్యతను స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ తీసుకోదు.