ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అభివృద్ధికి… పారిశ్రామిక, ఉపాధి కల్పనకు బాటలు వేసే కొత్త రైలు మార్గం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,అక్టోబర్ 25,2024: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,అక్టోబర్ 25,2024: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం శుభపరిణామం. రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే ఈ రైల్వే ప్రాజెక్ట్‌ను మంజూరు చేసిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రైల్వే లైన్ రాజధానికి వచ్చే ప్రజలకు, అధికారులు, ఉద్యోగులకే కాకుండా అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చేవారికి సౌకర్యంగా ఉంటుంది. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ రైలు మార్గం రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారబోతోంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కొత్త రైలు మార్గం అనుసంధానం కావడం వల్ల పారిశ్రామిక పురోగతి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

ఈ ప్రాజెక్ట్ పర్యావరణహితంగా, 6 కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గించే విధంగా నిర్మితమవుతోంది. అంటే, 25 లక్షల చెట్లు పెంచినట్లే కర్బన ఉద్గారాలు తగ్గించబడతాయి. ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా 19 లక్షల పని దినాలు కల్పించే అవకాశం లభించడం గొప్ప విషయం. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎలాంటి విఘాతం లేకుండా అధునాతన పరిజ్ఞానంతో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. అమరావతి రైల్వే లైన్ మోడల్ రైలు మార్గంగా నిలుస్తుంది.

బహుముఖ ప్రయోజనం కలిగిన ఈ నూతన రైలు మార్గాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అభినందనలు తెలియచేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

About Author