కృష్ణా జిల్లాలో ఎంపాక్స్ వైరస్ కలకలం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 25, 2024: విజయవాడలో మంకీ పాక్స్(ఎంపాక్స్) వ్యాధి కలకలం రేపింది. దుబాయిలో ఉన్నత విద్య కోసం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 25, 2024: విజయవాడలో మంకీ పాక్స్(ఎంపాక్స్) వ్యాధి కలకలం రేపింది. దుబాయిలో ఉన్నత విద్య కోసం వెళ్లి, ఇటీవల విజయవాడకు తిరిగి వచ్చిన కుటుంబంలోని ఒక చిన్నారికి వ్యాధి లక్షణాలు కనబడటంతో, అధికారులు మంకీ పాక్స్‌గా అనుమానం వ్యక్తం చేశారు.

ఈ కుటుంబంలో చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది, దీనిని చూసిన వైద్యులు, ఈ లక్షణాలను మంకీ పాక్స్ లక్షణాలుగా భావిస్తున్నారు.

విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి వెంటనే చికిత్స ప్రారంభించారు. వ్యాధి వ్యాప్తి నుంచి ఇతరులను రక్షించేందుకు, కుటుంబాన్ని మొత్తం ఐసోలేషన్‌లో ఉంచారు.

చిన్నారి నమూనాలను సేకరించి, పరీక్షల కోసం పుణెలోని ల్యాబ్‌కి పంపించారు. పరీక్ష ఫలితాలు రాగానే, మంకీ పాక్స్‌ ఉందా లేదా అనే విషయం తెలిసే అవకాశం ఉంది.

అధికారులు ఈ ఘటనపై నిఘా పెట్టి, నగరంలోని ప్రజలకు వ్యాధి గురించి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు, వారికి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

About Author