చలనచిత్ర రంగంలో విశేష సేవలకు డా. హరనాథ్ పోలిచెర్లకు ‘లోకనాయక్ ఫౌండేషన్’ జీవన సాఫల్య పురస్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 19,2025: చలనచిత్ర నటుడు,నిర్మాత డా. హరనాథ్ పోలిచెర్లకు ప్రముఖంగా గౌరవం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్థంతి,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 19,2025: చలనచిత్ర నటుడు,నిర్మాత డా. హరనాథ్ పోలిచెర్లకు ప్రముఖంగా గౌరవం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్థంతి, ఎఎన్ఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా, ఆయనకు “లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం” అందజేయడం జరిగింది.

ఈ ప్రత్యేకమైన వేడుకలో ముఖ్య అతిథులుగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, దర్శకులు అశ్వనీదత్‌, వైవీఎస్ చౌద‌రి, రచయిత అందెశ్రీ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ,అనేక సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, అతిథులు డా. హరనాథ్ పోలిచెర్లను సత్కరించి, ఆయన వైద్య రంగం, సినీ రంగంలో చేసిన సేవలను ప్రశంసించారు.

డా. హరనాథ్ పోలిచెర్ల ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా, ఈ గౌరవాన్ని అందజేసిన లోకనాయక్ ఫౌండేషన్ నిర్వాహకులకు, అతిథులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

సినీ రంగంలో తన ప్రత్యేక ప్రతిభతో నిలిచిన డా. హరనాథ్ పోలిచెర్ల, ప్రముఖ నిర్మాత రామానాయుడు ప్రధాన పాత్రలో నటించిన “హోప్” చిత్రం, అలాగే సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన “చంద్రహాస్” చిత్రాలను నిర్మించారు.

“అలెక్స్”, “చాప్టర్ 6”, “బీఎఫ్ఎఫ్”, “కెప్టెన్ రానా ప్రతాప్”, “డ్రిల్” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన “నా తెలుగోడు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు, దీనికి గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడెమీ కాస్టింగ్,ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు.

డా. హరనాథ్ పోలిచెర్ల ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా, సినిమారంగం నుండి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

About Author