తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు… ఈసారి మరింత ఉత్సాహం, పండుగ సందడితో ప్రజలు ముందుకు వస్తున్నారు. పొరుగు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు… ఈసారి మరింత ఉత్సాహం, పండుగ సందడితో ప్రజలు ముందుకు వస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం చర్చలు జరుపుతున్నాం. రోడ్ల మరమ్మతుల విషయంలో చాలా వరకు మార్పులు తీసుకువచ్చాం.
వచ్చే నెలాఖరులో గుంతలేని రహదారుల పనులు పూర్తి చేస్తాం. దశల వారీగా అన్ని రహదారుల పనులు పూర్తి చేసి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు మంచి మార్గం సిద్ధమైంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు దోహదపడుతున్నాయి.

క్లీన్ ఎనర్జీలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ పర్యటన ఉపయోగపడుతుంది. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రాచుర్యం చెయ్యవచ్చు, తద్వారా పెట్టుబడులకు అవకాశాలు వస్తాయి. గ్రీన్ ఎనర్జీ, బయో ఫ్యూయల్స్ రంగాల్లో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాం.
రానున్న రోజుల్లో 5 వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. రిలయన్స్ సంస్థ రూపొందిస్తున్న బయో కంప్రెస్డ్ గ్యాస్ ద్వారా రైతులకు ఎకరాకు రూ.30 వేలు కౌలు లభిస్తుంది. తరువాత ఆ వ్యర్థాలు ఎరువులుగా ఉపయోగపడతాయి. కుప్పంలో ప్రతి ఇంటికీ పిఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పూర్తిసబ్సిడీతో ఈ సూర్యఘర్ కార్యక్రమం అమలు చేస్తాం. ఇతర వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ పెట్టుబడితో ఈ పథకం అమలు చేయాలనుకుంటున్నాం. పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత విద్యుత్ ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ.1.15 లక్షలు ఖర్చవుతుంది.
ఇందులో కేంద్ర సబ్సిడీ పోగా మిగిలిన మొత్తం లబ్ధిదారులు భరించాలి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి కొంతకాలం ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా 100 శాతం సబ్సిడీ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సోలార్ విద్యుత్తుతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆదాయం పొందే పైలట్ ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్ విధానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆదాయం పొందవచ్చు. ఇది సెల్ఫ్-ఎంప్లాయిమెంట్ అవుతుంది. కుప్పంలో దీన్ని పైలట్గా ప్రారంభించాం.

గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తాం. మిగిలిన ఉద్యోగులను సంబంధిత శాఖలకు పంపిస్తాం. ప్రజలకు సంబంధించిన డేటా ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచే కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటినీ జీయోట్యాగ్ చేసి, ప్రతి వ్యక్తి, ప్రతి ఇంటి యూనిట్గా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
డ్రోన్, ఎఐ, ఐఓటి, సిసి కెమారాలు, ఆధార్ వంటి సాంకేతికతలతో ప్రభుత్వ సేవల్లో, ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం. ప్రజల సమాచారాన్ని రియల్ టైంలో మానిటరింగ్ చేసి, అనాలసిస్ చేయడం ద్వారా పాలన మరింత మెరుగవుతుంది. వెల్దీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ – ఇది మా విధానం. గతంలో చేపట్టిన హ్యాపీ సండే వంటి కార్యక్రమాలను మళ్లీ నిర్వహిస్తాం.
హ్యాపీ సండే, కమ్యూనిటీ ఫ్రెండ్షిప్ వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య అనుబంధాలు పెంచుతాం. సెల్ ఫోన్లు ప్రజలు బానిసల్లా మారిపోతున్నారు. జీవితం మెకానికల్గా మారిపోతుంది. మనమే ఆనందంగా ఉండి, పక్కవాళ్లు కూడా ఆనందంగా ఉండాలి. ఇదే పీ4 విధానం.

పీ4 విధానంపై కాన్సెప్ట్ పేపర్ను విడుదల చేస్తాం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అట్టడుగునున్న వాళ్లకు చేయూతనిచ్చే కార్యక్రమం ప్రారంభిస్తాం.