మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.. త్వరలో తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ లాంచ్..!

వారాహిమీడియా డాట్ న్యూస్,​హైదరాబాద్, ఏప్రిల్ 11,2026 : విలువలతో కూడిన జర్నలిజం, నిష్పక్షపాత వార్తలే లక్ష్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.

వారాహిమీడియా డాట్ న్యూస్,​హైదరాబాద్, ఏప్రిల్ 11,2026 : విలువలతో కూడిన జర్నలిజం, నిష్పక్షపాత వార్తలే లక్ష్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. మారుతున్న మీడియా ధోరణుల్లో వాస్తవాలను వెలికితీస్తూ, ప్రజల పక్షాన నిలిచేందుకు ఒక సమగ్ర డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు.

తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ వార్తా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ప్రజల గొంతుకగా కొత్త వేదిక
సమాజంలోని అణగారిన వర్గాలు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన అజెండాగా మార్చుకుని తమ సంస్థ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎవరికీ పక్షపాతం వహించకుండా, కేవలం వాస్తవాల ఆధారంగానే వార్తలు అందిస్తామని, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తొలుత డిజిటల్ రూపంలో వార్తలు అందించిన అనంతరం, అదే స్ఫూర్తితో పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా తీసుకురానున్నట్లు తన ట్వీట్‌లో వెల్లడించారు.

ఇదీ చదవండి :భద్రత, అవగాహన కోసం టాల్ రేడియో ఎస్ సి ఎస్ సి (SCSC) కీలక భాగస్వామ్యం..

Read this also..Instagram Content Trends 2026: The Formats and Styles Winning Right Now

రాజకీయాల నుంచి మీడియా బాట
చార్టెడ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించి, రాజ్యసభ సభ్యునిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి.. గతేడాది తన పదవీ కాలం ఉండగానే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే తాను రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వ్యక్తిగత బంధాలే ముఖ్యం
తన రాజీనామా సమయంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, భారతికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. అటు ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి :భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో MG విండ్సర్ ప్రభంజనం..

Read this also:MG Windsor Emerges as India’s Top-Selling Electric Vehicle in 2025..

రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ఇకపై వ్యవసాయ రంగంతో పాటు మీడియా రంగంలోనూ క్రియాశీలకంగా ఉండి ప్రజలకు సేవ చేస్తానని విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు.

About Author