అమరావతిలో ‘త్యాగ ప్రతీక’.. రేపే పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, మార్చి 15,2026 : తెలుగుజాతి ఆత్మగౌరవ శిఖరం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, మార్చి 15,2026 : తెలుగుజాతి ఆత్మగౌరవ శిఖరం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిలో రాజధాని అమరావతిలో నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది.

Read this also:Grand Launch of ‘Souq-e-Deccan’ Expo in Hyderabad..

ఇదీ చదవండి..ఆదివారం మాత్రమే సెలవు దినం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా..?

అమరజీవి 125వ జయంతిని పురస్కరించుకుని మార్చి16న (సోమవారం) ఉదయం 10 గంటలకు శాఖమూరులోని స్మృతివనంలో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

58 రోజుల పోరాటం.. 58 అడుగుల కాంస్యం..


రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన 58 రోజుల అలుపెరగని నిరాహార దీక్షకు గుర్తుగా.. ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం ఆరు నెలల రికార్డు కాలంలోనే ఈ పనులు పూర్తి చేయడం విశేషం. రాజధానిలో ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల సువిశాల స్మృతివనంలో ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు.

తరలిరానున్న ప్రముఖులు..


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఇతర కేబినెట్ సహచరులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

ప్రతి తెలుగువాడూ గర్వించేలా..


తెలుగు వారి పోరాట పటిమను, త్యాగనిరతిని భావితరాలకు చాటిచెప్పేలా ఈ పార్కును తీర్చిదిద్దినట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు.

మన అస్తిత్వం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతకు నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలో ఈ విగ్రహం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

About Author