ఆదివారం మాత్రమే సెలవు దినం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా..?
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 26,2026: ఆదివారం అనే పేరు వింటేనే మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి, పని నుంచి విరామం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 26,2026: ఆదివారం అనే పేరు వింటేనే మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి, పని నుంచి విరామం తీసుకోవడానికి ఒక రోజు. భారతదేశంలో ఆదివారం వారపు సెలవుదినంగా ఎలా మారింది..?
అందుకు ప్రధాన కారణాలు ఏంటి..? ఆదివారం వారపు సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది, ఇది కార్మికుల హక్కులు, బ్రిటిష్ పాలనకు సంబంధించినది. ఆదివారం వారపు సెలవు దినంగా ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
విరామం లేకుండా పని చేయడం..
ఈ రోజు మనం ఆనందించే వారాంతం సెలవుదినం ఆదివారం.. ఎల్లప్పుడూ ఇలా ఉండేది కాదు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలో కార్మికుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి.
వారు వారంలో ఏడు రోజులూ విరామం లేకుండా పని చేయాల్సి వచ్చేది. ఎక్కువ గంటలు నిరంతరాయంగా పనిచేయడం వల్ల అక్కడి కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వాళ్లందిరికీ నాయకుడు అయ్యాడు.

ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం..
అప్పుడు ఆయా బాధిత కార్మికుల దుస్థితిని చూసి, నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హక్కుల కోసం తన గొంతును వినిపించాడు. 188, 1884 మధ్య, అతను నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలనకు అనేక సందేశాలను పంపాడు.
అతని విజ్ఞప్తి మేరకు వేలాది మంది కార్మికులు సమావేశమయ్యారు, కానీ అది ఒకటి, రెండురోజుల పోరాటం కాదు. ఏకంగా ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి, బ్రిటిష్ ప్రభుత్వం కార్మికుల సంఘీభావం, లోఖండే ప్రయత్నాలకు లొంగిపోయింది. జూన్ 10, 1890న, ఆదివారం భారతదేశంలో అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించారు.
మరి ఆదివారం ఎందుకు అంటే..?

ఆదివారంను సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన, ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలో, భారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని అనుసరించిన బ్రిటిష్ వారు పాలించారు. వారికి, ఆదివారం చర్చికి వెళ్లడానికి ఒక రోజుఆదివారమే. అందువల్ల, ఆదివారం సెలవు దినంగా ఎంపిక చేశారు.
భారతీయ సంస్కృతి, హిందూ మతంతో ముడిపడి ఉన్న మరొక వాదన ఏమిటంటే, ఆదివారం సూర్య దేవునికి, కొన్ని ప్రాంతాలలో, లార్డ్ ఖండోబాకు అంకితం చేశారు. బ్రిటిష్ వారిలాగే, భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి, ఆరాధన కోసం ఒక రోజును కలిగి ఉండాలనే ఆదేశాలతో ఆదివారాన్నే సెలవుదినంగా ప్రకటించారు బ్రిటిష్ వాళ్ళు.
1700 సంవత్సరాల చరిత్ర..
ఆసక్తికరంగా, ఆదివారం విశ్రాంతి దినంగా పాటించే ఆచారం భారతదేశంలో మాత్రమే మొదవలవ్వడం తొలిసారి కాదు. క్రీస్తుశకం 321లో, రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారం రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు.
క్రమంగా, ఈ సంప్రదాయం యూరప్, తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది. అలా వారు ఆదివారాన్ని సెలవుదినంగా భారతదేశానికి తీసుకువచ్చారు.