మారుతున్న భారతీయుల ఆరోగ్య బీమా ధోరణి.. పెరుగుతున్న అవేర్నెస్.. !
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 30 2025: పెరుగుతున్న వైద్య ఖర్చులు, మారుతున్న జీవనశైలి వ్యాధుల నేపథ్యంలో భారతీయులు ఆరోగ్య బీమా పట్ల తమ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 30 2025: పెరుగుతున్న వైద్య ఖర్చులు, మారుతున్న జీవనశైలి వ్యాధుల నేపథ్యంలో భారతీయులు ఆరోగ్య బీమా పట్ల తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఆరోగ్య బీమా తీసుకోవడమే కాకుండా, అధిక కవరేజీని (Sum Insured) కోరుకుంటున్నారని ప్రముఖ బీమా సంస్థ ‘కేర్ హెల్త్ ఇన్సూరెన్స్’ తన 2025 వార్షిక నివేదికలో వెల్లడించింది.
అవేర్నెస్ పెరిగింది.. 27% వృద్ధి నమోదు!
నివేదిక ప్రకారం, 2023-24తో పోలిస్తే 2024-25లో బీమా పొందిన సభ్యుల సంఖ్యలో ఏకంగా 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేవలం జబ్బు పడినప్పుడు మాత్రమే కాకుండా, ముందుజాగ్రత్తగా (Preventive Health) బీమాను ఎంచుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.
ప్రతి వయసులోనూ ప్రాధాన్యత:
పిల్లల కోసం: 0-17 ఏళ్ల వయస్సు గల వారి సగటు బీమా మొత్తం 7% పెరిగింది. తమ పిల్లలకు మెరుగైన వైద్య భద్రత కల్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు ఇది సూచిస్తోంది.
యువత: కొత్తగా పాలసీలు కొనేవారిలో (18-35 ఏళ్లు) 30% కంటే ఎక్కువ మంది ఉండటం యువతలో పెరుగుతున్న బాధ్యతకు నిదర్శనం.
సీనియర్ సిటిజన్లు: 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య కూడా మొత్తం పాలసీదారులలో 14 శాతానికి చేరింది.

ఏయే వ్యాధులకు క్లెయిమ్స్ ఎక్కువ?
భారతీయులలో డెంగ్యూ, మలేరియా, సాధారణ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్,ఆర్థరైటిస్ వంటి జీవనశైలి వ్యాధులకు సంబంధించిన క్లెయిమ్స్ ఎక్కువగా వస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గుండె ,క్యాన్సర్ చికిత్సల కోసం అధిక విలువ కలిగిన క్లెయిమ్స్ పెరుగుతున్నాయి.
సాంకేతికతతో చేతులు కలిపిన ఆరోగ్యం:
డిజిటల్ విప్లవంతో వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్ల నుండే బీమా సేవలను పొందుతున్నారు.
యాప్ ద్వారా సేవలు: కేర్ హెల్త్ కస్టమర్ యాప్ ద్వారా 30% క్లెయిమ్స్, 15% పునరుద్ధరణలు (Renewals) జరుగుతున్నాయి.
వెల్నెస్ రివార్డ్స్: ఆరోగ్యంగా ఉండేందుకు నడక (Step Tracking) వంటి ఫీచర్లను ఉపయోగించి, రెన్యూవల్ ప్రీమియంపై డిస్కౌంట్లు పొందుతున్న వారి సంఖ్య 2.5 రెట్లు పెరిగింది.

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీష్ దోడేజా మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులు ఇప్పుడు టెక్-సావీగా మారుతున్నారు. నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను జోడించి సులభమైన, సమగ్రమైన ఆరోగ్య బీమా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని పేర్కొన్నారు.
కొత్త ట్రెండ్స్ ఇవే..
కేవలం హాస్పిటలైజేషన్ మాత్రమే కాకుండా.. ఓపిడి (OPD) ప్రయోజనాలు, టాప్-అప్ కవరేజ్, టెలికన్సల్టేషన్ ,హోమ్ కేర్ వంటి సదుపాయాలు ఉన్న పాలసీలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.