చందానగర్లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్ను ప్రారంభించిన సూపర్స్టార్ నాగార్జున
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ, 28 మార్చి ,2025: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన , ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ, 28 మార్చి ,2025: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన , ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్, హైదరాబాద్లోని చందానగర్లో తమ షోరూమ్ను వైభవంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. సూపర్స్టార్ నాగార్జున చేతుల మీదగా ప్రారంభించిన ఈ సరికొత్త షోరూమ్ ద్వారా రాష్ట్రంలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత విస్తరించటమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ షోరూమ్ కళ్యాణ్ జ్యువెలర్స్ కు చెందిన అద్భుతమైన డిజైన్ల శ్రేణిని అందిస్తుంది, వీటిలో ముహూరత్ (వివాహ ఆభరణాల శ్రేణి), ముద్ర (చేతితో రూపొందించిన యాంటిక్ ఆభరణాలు), నిమా (టెంపుల్ జ్యువెలరీ),మరెన్నో ప్రసిద్ధ బ్రాండ్లు ఉన్నాయి.
Read this also…SMFG India Credit raises USD 175 MN via ECB from Standard Chartered Bank & CTBC Bank
Read this also…Canon announces EOS R50 V with RF-S 14-30mm F4-6.3 IS STM PZ Lens – A Cinema-Grade Camera for Creators
కళ్యాణ్ జ్యువెలర్స్ కు చెందిన జీవనశైలి ఆభరణాల బ్రాండ్ – కాండెరే ఆవిష్కరణ ద్వారా ఈ ప్రారంభోత్సవ వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి. రూ. 10,000/- ధరలతో ప్రారంభమయ్యే కాండెరేలోని ఆభరణాలు ఆదర్శవంతమైన బహుమతిగా నిలుస్తాయి.

సూపర్స్టార్ నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ‘ట్రస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్’ అనే కంపెనీ సిద్దాంతానికి అనుగుణంగా వారు చూపుతున్న నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.
Read this also…Lauritz Knudsen Introduces IoT-Powered Smart Farming Solutions for Sustainable Agriculture
ఇది కూడా చదవండి...ఉద్యోగ విరామం తర్వాత మహిళలకు కొత్త అవకాశాలు – క్వాలిజీల్ ప్రత్యేక కార్యక్రమం
కొత్త షోరూమ్ గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఒక కంపెనీగా, మేము గణనీయమైన మైలురాళ్లను చేరుకున్నాము. గత కొద్ది సంవత్సరాలుగా, మేము ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను వ్యూహాత్మకంగా విస్తరించాము.
చందానగర్లోని కొత్త షోరూమ్ మా మార్కెట్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని, అదే సమయంలో మా విలువైన కస్టమర్లకు మరింత సౌలభ్యం , అవకాశాలను అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.