టీటీడీకి టీవీఎస్, ఎన్‌డీఎస్ ఎకో సంస్థల ద్విచక్ర వాహనాల విరాళం

వారాహి మీడియా డాట్ కామ్,ఫిబ్రవరి 11,2025: తిరుమల శ్రీవారి సేవలో భాగంగా చెన్నైకు చెందిన టీవీఎస్, బెంగళూరుకు చెందిన ఎన్‌డీఎస్ ఎకో సంస్థల ప్రతినిధులు మంగళవారం టిటిడికి విద్యుత్

వారాహి మీడియా డాట్ కామ్,ఫిబ్రవరి 11,2025: తిరుమల శ్రీవారి సేవలో భాగంగా చెన్నైకు చెందిన టీవీఎస్, బెంగళూరుకు చెందిన ఎన్‌డీఎస్ ఎకో సంస్థల ప్రతినిధులు మంగళవారం టిటిడికి విద్యుత్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా ఆలయం వద్ద అర్చకులు ఈ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థల ప్రతినిధులు వాహన తాళాలను టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీవీఎస్ ఐ-క్యూబ్ ఎక్స్ మోడల్ ద్విచక్ర వాహనం రూ. 2.70 లక్షలు, ఎన్‌డీఎస్ ఎకో ద్విచక్ర వాహనం రూ. 1.56 లక్షల విలువ కలిగినవని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్, తిరుమల డిఐ సుబ్రమణ్యం, ఎన్‌డీఎస్ ఎకో చైర్మన్ ఎంహెచ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author