రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజయం మనదే అన్నారు : మహేష్ భగవత్

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 3,2024 : జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీ జీ పీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు. రిస్క్ తీసుకుని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 3,2024 : జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీ జీ పీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు. రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజేతలు అవుతారని, లేదంటే అనుభవజ్ఞులు అవుతారని సూచించారు. రామకృష్ణ మఠంలో జరుగుతున్న’శౌర్య’ శిబిరాన్ని సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

యూ పీ ఎస్ సీ విద్యార్థులకు ఇంటర్వ్యూ ని ఎదురుకునే విషయం లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. 2024 లో 1016 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన అనన్య ౩వ రాంక్ సాధించారని ఆయన తెలిపారు.

ఇంటర్వ్యూ విషయం లో కోచింగ్ కోరుకునే పేద విద్యార్థులు 9440700105 వాట్సాప్ నెంబర్ కు వివరాలు పంపాలని మహేష్ భగవత్ సూచించారు. ‘శౌర్య’ శిబిరంలోని విద్యార్థులకు ఆయన ‘టైం మానేజ్మెంట్’ ‘ స్ట్రెస్ మానేజ్మెంట్’ పై చిట్కాలు చెప్పారు.

కార్యక్రమం లో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ సమాజానికి టెక్నాలజీ తో పాటు శ్రేష్ఠులైన యువతి యువకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరిస్తూ జీవితాలను ఉద్ధరించుకోవాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *