హైదరాబాద్లో సాంప్రదాయ అండ్ ఆధునిక పాల ఉత్పత్తుల పట్ల వినియోగదారుల అభిరుచులు: గోద్రెజ్ జెర్సీ మిల్క్ రిపోర్ట్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 26 నవంబర్, 2024: భారతదేశం జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, హైదరాబాద్ వాసులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 26 నవంబర్, 2024: భారతదేశం జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, హైదరాబాద్ వాసులు పాలకు మాత్రమే కాకుండా సాంప్రదాయ, ఆధునిక విలువ ఆధారిత పాల ఉత్పత్తులకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గోద్రెజ్ జెర్సీ మిల్క్ రిపోర్ట్ వెల్లడించింది.
పెరుగు 81% వద్ద అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తిగా ఉద్భవించగా, నెయ్యికి 70% ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది, సాంప్రదాయ పాడితో హైదరాబాద్కు బలమైన అనుబంధం పనీర్తో 60% వెన్నతో 59% వినియోగదారుల ప్రాధాన్యతతో కొనసాగుతుందని డేటా మరింతగా వెల్లడించింది.

ఆధునిక డైరీ వేరియంట్లు కూడా ఆమోదం పొందుతున్నాయి, 46% మంది వినియోగదారులు తమ ఆహారంలో పెరుగును చేర్చుకుంటున్నారు. 47% మంది ఫ్లేవర్డ్ పాల ఎంపికలపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ, లక్నో, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు , కోల్కతా నుండి వినియోగదారుల ప్రతిస్పందనలను కవర్ చేస్తూ ‘బాటమ్స్ అప్…ఇండియా సేస్ చీర్స్ టు మిల్క్!’ అనే శీర్షికతో రూపొందించిన ఈ నివేదిక వినియోగదారుల ప్రాధాన్యతలు, పరిశ్రమల పోకడలపై విలువైన పరిజ్ఙానంను అందిస్తుంది.
పాడి ,పాల ఆధారిత ఉత్పత్తులకు ఇస్తోన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవడంతో పాటు, నాణ్యత ప్రాధాన్యత ఫార్మ్ నుంచి ఇంటికి ప్రీమియం పాల కోసం చెల్లించడానికి సుముఖతను అర్థం చేసుకోవడానికి సర్వే ప్రయత్నించింది.
డెయిరీ ప్రాధాన్యతలపై గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులు సాంప్రదాయ ప్రాధాన్యతలను,ఆధునిక పాల ఎంపికలకు నిష్కాపట్యతతో కూడిన ప్రత్యేక సమ్మేళనాన్ని ప్రదర్శిస్తున్నారు .

పెరుగు, పనీర్,నెయ్యి వంటి స్థిరంగా ఇష్ట పడే వాటి నుంచి యోగర్ట్,ఫ్లేవర్డ్ పాలు వంటి అభివృద్ధి చెందుతున్న ఎంపికల వరకు, నేటి పాల వినియోగదారులు తమ ఎంపికలలో నాణ్యత,పోషక విలువలను దృష్టిలో ఉంచుకుంటున్నారు.
భారతదేశం,పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది, గోద్రెజ్ జెర్సీ వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి , ఈ అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి కట్టుబడి ఉంది..” అని అన్నారు.
భారతదేశం విస్తృత శ్రేణి డెయిరీ రంగం కూడా నాణ్యతపై స్పష్టమైన ప్రాధాన్యతను చూపుతుంది. నివేదిక ప్రకారం, భారతీయ వినియోగదారులలో సగానికిపైగా అంటే, 54% మంది పాల ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు పాల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు , 51% మంది హైదరాబాద్ వినియోగదారులు దీనికి అమిత ప్రాధాన్యతనిస్తున్నారు.
కల్తీలేని ఉత్పత్తులపై పెరుగుతున్న ఈ అవగాహన సురక్షితమైన ,మేలైన పాల ఉత్పత్తులకు అధిక మొత్తంలో చెల్లించడానికి వినియోగదారులలో సుముఖతను సూచిస్తుంది.

ఈ సర్వేను యుగవ్ రూపొందించి, నిర్వహించింది. గోద్రెజ్ గ్రూప్ వైవిధ్యమైన ఆహార, వ్యవసాయ- వ్యాపార సమ్మేళనం అయిన గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (జిఎవిఎల్ ) అనుబంధ సంస్థ అయిన క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ గోద్రెజ్ జెర్సీ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తుంది.
నాణ్యత పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, గోద్రెజ్ జెర్సీ భారతదేశం డెయిరీ ల్యాండ్స్కేప్ పెరుగుదల అభివృద్ధికి దోహదం చేస్తూనే ఉంది. సమగ్ర పశుపోషణ, స్థిరమైన వ్యవసాయంపై కంపెనీ కార్యక్రమాలు పాడి పరిశ్రమలో ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు తమ ఆదాయ స్థాయిలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి .