మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 14,2024: ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 14,2024: ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గారు గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని… అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ రవిశంకర్ గారని అన్నారు. ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా నాకు ఉపదేశించిన గురువు శ్రీశ్రీ రవిశంకర్ గారు అని అన్నారు.
వారు ఆశీర్వాదాలు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

సాదర స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్ ఆయనను శాలువాతో సత్కరించారు. శ్రీశ్రీ రవిశంకర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించి ఆశీర్వదించారు.
• జీవితంలో విజయం సాధించాలంటే భక్తి, ముక్తి, యుక్తి, శక్తి ఉండాలి
శ్రీశ్రీ రవి శంకర్ గారు మాట్లాడుతూ “జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుంది. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుంది” అన్నారు.