డిసెంబర్ 22న హైదారాబాద్ లో కాపునాడు వ్యవస్థాపకులు, కాపు ఉద్యమ నేత మిరియాల వెంకట్రావు 84 జయంతోత్సవాలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 23,2024:కాపునాడు వ్యవస్థాపకులు, కాపు ఉద్యమ నేత మిరియాల వెంకట్రావు 84 జయంతోత్సవాలు డిసెంబర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 23,2024:కాపునాడు వ్యవస్థాపకులు, కాపు ఉద్యమ నేత మిరియాల వెంకట్రావు 84 జయంతోత్సవాలు డిసెంబర్ 22వ తేదీన హైదారాబాద్ లో పెద్దఎత్తున నిర్వహించ నున్నారు. అందుకు సంబంధించిన ఉత్సవాల ఆహ్వాన కమిటీ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాపు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సభ్యులు అందరూ మిరియాల వెంకట్రావుగారి జయంతి ఉత్సవ వేడుకలు సంబంధించి అవసరమైన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కటారి అప్పారావు గారు, ఛార్టర్డ్ అకౌంటెంట్ ఏవి రత్నం గారు,చంద్ర జనార్ధన్ గారు, మారిశెట్టి మురళి గారు, మిరియాల వెంకట్రావు గారి సన్నిహితులు డివి రావు గారు తదితరులు పాల్గొన్నారు.