దక్షిణ భారత ప్రయాణికుల కొత్త ట్రెండ్: సోలో ట్రిప్స్ ,అన్వేషించని గమ్యస్థానాలకే మొగ్గు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 3,2026: దక్షిణ భారతదేశంలోని పర్యాటకుల ఆలోచనా విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. గతంలో లాగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 3,2026: దక్షిణ భారతదేశంలోని పర్యాటకుల ఆలోచనా విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. గతంలో లాగా కేవలం రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రశాంతతను,సరికొత్త అనుభూతులను అందించే ‘తక్కువ మంది సందర్శించే’ (Offbeat) ప్రాంతాల వైపు వీరు మొగ్గు చూపుతున్నారు.

సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’ (Scoot) నిర్వహించిన “సౌత్ ఇండియా ట్రావెల్ ఇన్‌సైట్స్ 2025” సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సోలో ట్రావెల్ హవా: 2026లో అంతర్జాతీయ యాత్ర చేయాలనుకుంటున్న ప్రతి నలుగురిలో ముగ్గురు (74%) ఒంటరిగా (Solo Trip) వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇదీ చదవండి :వరంగల్ ఫుడ్ రిపోర్ట్ 2025: 4.46 లక్షల చికెన్ బిర్యానీలు.. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీదే హవా..!

ఇదీ చదవండి :మే 9న కామెడ్‌కె యుజిఇటి (COMEDK UGET) / యూని-గేజ్ 2026 పరీక్ష: నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ..

అన్వేషించని ప్రాంతాలు: సుమారు 56% మంది పర్యాటకులు రద్దీ తక్కువగా ఉండే కొత్త గమ్యస్థానాలను చూడాలనుకుంటున్నారు. ముఖ్యంగా థాయిలాండ్‌లోని క్రాబీ, చియాంగ్ రాయ్, ఆస్ట్రేలియాలోని డార్విన్ వంటి ప్రాంతాలకు డిమాండ్ పెరుగుతోంది.

బడ్జెట్,సౌకర్యం: తక్కువ ధరలో విమాన టిక్కెట్లు (38%), సులభమైన వీసా ప్రక్రియ (38%), తక్కువ జనసమూహం (43%) వంటి అంశాలు పర్యాటకుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

ఇదీ చదవండి :టెక్నాలజీ, కళల మేళవింపుతో కనువిందు చేసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025..

ఇదీ చదవండి :దేశంలోనే తొలి ‘PM E-DRIVE’ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రక్కును డెలివరీ చేసిన మాంట్రా ఎలక్ట్రిక్..

టెక్నాలజీతో ప్రయాణ ప్రణాళికలు
ప్రయాణికులు ఇప్పుడు కేవలం ట్రావెల్ ఏజెంట్లపై ఆధారపడకుండా డిజిటల్ సాధనాలను వాడుతున్నారు.

53% మంది సోషల్ మీడియా ద్వారా, 45% మంది ఆన్‌లైన్ రివ్యూల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఆశ్చర్యకరంగా, 28% మంది తమ ప్రయాణ ప్రణాళికల కోసం ChatGPT వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు.

దక్షిణ భారత ప్రయాణికులు సగటున 7.6 రోజులు పర్యటనకు కేటాయిస్తున్నారు. వీరి సగటు బడ్జెట్ రూ. 2.34 లక్షలుగా ఉంది. ఇందులో అత్యధిక శాతం (60%) మంది రూ. 1 నుంచి 3 లక్షల మధ్య ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారు.

“దక్షిణ భారత ప్రయాణికులు తమ సొంత నిర్ణయాలతో కొత్త సాహసాలను కోరుకుంటున్నారు. భారతదేశంలోని ఆరు నగరాల నుంచి సింగపూర్‌కు ఉన్న మా విమాన సర్వీసులు ,విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా వీరికి అద్భుతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

About Author

You may have missed