టెక్నాలజీ, కళల మేళవింపుతో కనువిందు చేసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కోల్­కతా,ఫిబ్రవరి 3,2026: భారతదేశపు ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేదిక ‘బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025’ ఘనంగా ముగిసింది. గురుగ్రామ్, జైపూర్,కోల్­కతా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కోల్­కతా,ఫిబ్రవరి 3,2026: భారతదేశపు ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేదిక ‘బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025’ ఘనంగా ముగిసింది. గురుగ్రామ్, జైపూర్,కోల్­కతా నగరాల్లో నిర్వహించిన ఈ టూర్, ఫ్యాషన్ ప్రపంచంలో సాంకేతికత, వేగం,సంప్రదాయ కళలను సరికొత్త రీతిలో ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

మూడు నగరాలు – మూడు విభిన్న కథనాలు
ఈ ఏడాది ఫ్యాషన్ టూర్ ‘ద వన్ అండ్ ఓన్లీ’ అనే నినాదంతో మూడు వినూత్న థీమ్స్­ను పరిచయం చేసింది:

గురుగ్రామ్ (ఫ్యూచర్­వర్స్): డిజైనర్లు ఫాల్గుణి ,షేన్ పీకాక్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ భవిష్యత్తును ప్రతిబింబించేలా ఈ షో సాగింది. రోబోట్లు, హోలోగ్రాఫిక్ టెక్నాలజీ మధ్య బాలీవుడ్ తారలు షాహిద్ కపూర్, తమన్నా భాటియా ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇదీ చదవండి :దేశంలోనే తొలి ‘PM E-DRIVE’ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రక్కును డెలివరీ చేసిన మాంట్రా ఎలక్ట్రిక్..

Read this also:MG Cyberster Crowned India’s Top-Selling Sports Car for 2025..

స్పోర్ట్ వేగాన్ని, ఫ్యాషన్ శైలిని మేళవిస్తూ నమ్రతా జోషీపురా, అభిషేక్ పట్నీలు అద్భుతమైన కలెక్షన్స్ ప్రదర్శించారు. సూపర్ కార్ల మధ్య మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధూ, ర్యాపర్ రఫ్తార్ సందడి చేశారు.

కోల్­కతా (ఫ్యూచర్ ఈజ్ క్రాఫ్టెడ్): చారిత్రాత్మక హౌరా బ్రిడ్జ్ నేపథ్యంలో అనామికా ఖన్నా (AK | OK) సంప్రదాయ కళకు ఆధునిక హంగులు అద్దారు. హుగ్లీ నదిపై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ థియేటర్­లో ఇషాన్ ఖట్టర్ మెరిశారు.

Read this also:Škoda Kylaq Celebrates First Anniversary with 50,000 Sales Milestone

ఇదీ చదవండి :కుప్పంలో హిందాల్కో ‘మల్టీ-స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు..

జైపూర్ (హై ఆక్టేన్ కుట్యూర్): మోటర్­

పెర్నోడ్ రికార్డ్ ఇండియా CMO దేబశ్రీ దాస్­గుప్తా మాట్లాడుతూ, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ భారతదేశపు ఫ్యాషన్ చరిత్రలో ఒక మైలురాయి. సృజనాత్మకత, సంస్కృతి ,ఆవిష్కరణలను కేంద్రబిందువుగా ఉంచుతూ భవిష్యత్తు తరాలకు ఈ టూర్ దిశానిర్దేశం చేస్తుంది” అని పేర్కొన్నారు.

FDCI చైర్మన్ సునీల్ సేఠీ మాట్లాడుతూ, “సృజనాత్మకతను, సంస్కృతిని వేడుకగా జరుపుకుంటూ భారతీయ ఫ్యాషన్ రంగానికి ఈ ఎడిషన్ సరికొత్త వేగాన్ని అందించింది” అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ టూర్ మొత్తం 2100 మందికి పైగా ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఫ్యాషన్ లీడర్లను ఆకట్టుకుంది. ఫ్యాషన్ అనేది కేవలం దుస్తులకు సంబంధించింది మాత్రమే కాదు, అది ఒక నిరంతర ప్రయాణం అని బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ మరోసారి నిరూపించింది.

About Author