వ్యవసాయ రంగంలో మహిళా నైపుణ్యాల పెంపునకు గోద్రెజ్ అగ్రోవెట్ ‘దిశ’ ప్రారంభం!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 17,2026: పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రముఖ ఆహార,వ్యవసాయ వ్యాపార సంస్థ అయిన గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్, ఇవాళ తన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 17,2026: పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రముఖ ఆహార,వ్యవసాయ వ్యాపార సంస్థ అయిన గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్, ఇవాళ తన మూడో ఎడిషన్’ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ సమ్మిట్’ వేదికగా ‘దిశ’ అనే మహిళా కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

అందరినీ కలుపుకునిపోయేలా, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా వ్యవసాయ రంగంలో నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయాలనే కంపెనీ నిబద్ధతను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.

గోద్రెజ్ అగ్రోవెట్ చేపట్టిన సీఎస్‌ఆర్ చొరవ అయిన ఈ దిశ కార్యక్రమం బీఎస్సీ అగ్రికల్చర్, దానికి అనుబంధ విభాగాల్లో విద్యను అభ్యసిస్తున్న మహిళల్లో ఉపాధి అవకాశాలను పెంచేలా ఒక క్యాంపస్-టు-కార్పొరేట్ ఫినిషింగ్ స్కూల్ తరహాలో రూపొందింది.

ఇది సేల్స్, కమ్యూనికేషన్ ,వృత్తిపరమైన సన్నద్ధత వంటి రంగాలలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. తద్వారా వారు తమ వృత్తిపరమైన కెరీర్‌ను సులభంగా ప్రారంభించడానికి వీలవుతుంది.

ఇదీ చదవండి :కోక్ స్టూడియో భారత్ ‘బుల్లెయ వే’: కొత్త తరం కోసం బుల్లే షా సూఫీ వారసత్వం!

ఇదీ చదవండి :భక్తులకు అంకితం: కృష్ణ జన్మభూమిలో ఘనంగా ‘కృష్ణావతారం’ ట్రైలర్ విడుదల..

1M1B ఫౌండేషన్, ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమలు అవుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా 276 మందికి పైగా మహిళా విద్యార్థినులు శిక్షణ పొందారు. వీరిలో పలువురు ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు కూడా సాధించారు.

ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ సీఈఓ సునీల్ కటారియా మాట్లాడుతూ. ”భారతదేశ వ్యవసాయం ,దాని అనుబంధ రంగాలు స్థిరమైన వృద్ధి, ఉత్పాదకత, గ్రామీణ అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఒక కీలక దశలో ఉన్నాయి.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. దిశ కార్యక్రమం ద్వారా నైపుణ్యం కలిగిన మహిళా నిపుణులను మేం సిద్ధం చేస్తున్నాము. మన దేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది ఆధారపడిన ఈ రంగంలో వారు అర్థవంతమైన పాత్రలు పోషించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :సిగ్నేచర్ గ్లోబల్, టోనినో లాంబోర్గిని సంయుక్తంగా గురుగ్రామ్‌లో సరికొత్త లగ్జరీ బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్

ఇదీ చదవండి :నగరంలో మలబార్ గోల్డ్ ‘ఆర్టిస్ట్రి స్టోర్’ ప్రారంభం…

గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ సస్టైనబిలిటీ మరియు సీఎస్ఆర్ హెడ్ పాక్జాన్ దస్తూర్(Pakzan Dastoor) ఈ దిశ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. ”గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో మేం ఏదైనా నిర్మించినా లేదా అభివృద్ధి చేసినా అందరినీ కలుపుకుని పోవడానికే ప్రాధాన్యత ఇస్తాం.

మహిళలు నేరుగా వ్యవసాయ పరిశ్రమలోకి ప్రవేశించి, మంచి ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయాలనే మా నిబద్ధతకు ఈ దిశ కార్యక్రమమే నిదర్శనం. కలిసి పని చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఈ పైలట్ ప్రాజెక్ట్ నిరూపించింది.

ఇప్పటికే 33 శాతానికి పైగా మహిళలు వ్యవసాయ రంగంలో వివిధ ఉద్యోగాల్లో చేరడం మాకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి” అని చెప్పారు.

గోద్రెజ్ అగ్రోవెట్ సీహెచ్ఆర్ఓ మల్లిక ముత్రేజా మాట్లాడుతూ.. ”బలమైన, అందరినీ కలుపుకుని పోయే టీమ్‌ను తయారు చేయాలంటే వారి కెరీర్ మొదటి నుండి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. గోద్రెజ్ అగ్రోవెట్‌లో మహిళలు తమ కెరీర్ ప్రారంభ దశ నుండి నాయకత్వ స్థాయికి ఎదిగే వరకు మేం వారికి తోడుగా ఉంటాం.

మా నియామక ప్రక్రియలు, ఇతర శిక్షణా కార్యక్రమాలతో పాటు దిశ వంటి చొరవలు మహిళల కెరీర్‌కు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి. భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా ఒక బలమైన శ్రామిక శక్తిని నిర్మించాలనే మా నిబద్ధతను ఇది తెలియజేస్తుంది” అని పేర్కొన్నారు.

గోద్రెజ్ అగ్రోవెట్ వ్యవసాయ రంగంలో లక్ష మంది మహిళలను ప్రోత్సహించాలనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ‘దిశ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ సంస్థ నైపుణ్య శిక్షణ, స్కాలర్‌షిప్‌లు, కెరీర్ ప్రారంభ దశలో ఇచ్చే ప్రోత్సాహం ,నాయకత్వ శిక్షణ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా సుమారు 63.3 వేల మందికి పైగా మహిళలకు చేరువయ్యింది.

About Author