జెన్ జెడ్, మిలీనియల్స్: పెంపుడు జంతువుల యాజమాన్యానికి కొత్త దశ | మార్స్ సర్వే విశ్లేషణ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, డిసెంబర్ 23,2024: పెట్ కేర్, న్యూట్రిషన్ లో గ్లోబల్ లీడర్ అయిన మార్స్ పెట్ కేర్ తన గ్లోబల్ పెట్ పేరెంట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, డిసెంబర్ 23,2024: పెట్ కేర్, న్యూట్రిషన్ లో గ్లోబల్ లీడర్ అయిన మార్స్ పెట్ కేర్ తన గ్లోబల్ పెట్ పేరెంట్ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 20,000 మందికి పైగా పెంపుడు జంతువుల యజమానులు (కుక్కలు, పిల్లులు) విస్తరించింది.
వీరిలో భారతదేశంలో వెయ్యి మంది కూడా ఉన్నారు. ఇది మన జీవితాలపై పెంపుడు జంతువుల ప్రభావాన్ని సూచిస్తుంది. ఇది మార్స్ పెట్కేర్ నిర్వహించిన అతిపెద్ద సర్వేలలో ఒకటి.

సర్వే చేసిన పెంపుడు జంతువుల యజమానుల్లో 2/3 మంది తమ కుక్క లేదా పిల్లిని వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చూస్తున్నారు.
జంతువుల పెంపకం పెరుగుతుండటం, ప్రజలు పెంపుడు జంతువులను తమ జీవితంలో ముఖ్యమైన భాగంగా పరిగణించడంతో, సర్వే ఫలితాలు పెంపుడు జంతువుల యజమానులు, వాళ్లపెంపుడు జంతువుల మధ్య భావోద్వేగ సంబంధాలు గతంలో కంటే బలంగా ఉన్నట్లు నిరూపిస్తున్నాయి.
జెన్ జెడ్, మిలీనియల్స్ బేషరతుగా ప్రేమను అందించే, ఒత్తిడిని తగ్గించే, బంధాలకు విలువనిచ్చే గొప్ప సహచరులు. దేశంలో 64% కంటే ఎక్కువ యువత కుక్కలను, 60% మంది పిల్లులను పెంచుకుంటూ.. అవి తమకు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడ్డాయని తెలిపారు.
పెంపుడు జంతువులు వారి జీవితంలో అంతర్భాగమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెంపుడు జంతువుల దత్తత 67% కుక్కపిల్లలు, 70% పిల్లులకు కనీసం 3 నెలలు లేదా అంతకంటే తక్కువ వయస్సుతో ప్రారంభమవుతుంది.

దత్తతపై అవగాహన పెంచడంలో ఇంకా ముందడుగు ఉందని సర్వే వెల్లడించింది. 6% కుక్కపిల్లలు, 4% పిల్లులనే షెల్టర్ల నుంచి దత్తత తీసుకుంటున్నారు. 17% కుక్కపిల్లలు, 10% పిల్లిపిల్లలు పెంపకందారుల ద్వారాను, 23% కుక్కపిల్లలు, 19% పిల్లులను దుకాణాల్లో తీసుకుంటున్నారు.
దత్తత, బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఇది గణనీయమైన అవకాశాన్ని సూచిస్తుంది, ఇది భారతదేశంలో మరింత దయగల పెంపుడు జంతువుల సంరక్షణ సంస్కృతికి దారితీస్తుంది.
ఈ సందర్బంగా మార్స్ పెట్కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ, “ఈ సర్వే కొత్త తరం భారతీయ పెంపుడు జంతువుల యజమానుల గురించి ప్రధానంగా చెబుతుంది.
వారు పెంపుడు జంతువులను వారి శ్రేయస్సుకు అత్యవసరంగా భావిస్తారు. భారతీయ యువత రికార్డు సంఖ్యలో పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడమే కాకుండా, ఈ సంబంధాలు తీసుకువచ్చే భావోద్వేగ, మానసిక ప్రయోజనాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మార్స్ పెట్కేర్లో మాకు పెంపుడు జంతువుల యజమానులతో మంచి సంబంధాలున్నాయి. వాళ్లు చెప్పే కొత్త విషయాలు వింటూ, చాలా నేర్చుకుంటున్నాము. మార్స్ గ్లోబల్ పెట్ పేరెంట్ స్టడీ ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల యాజమాన్యం ఎలా అభివృద్ధి చెందుతోందనే దాని గురించి తెలుసుకోవడానికి, అవగాహనను పంచుకోవడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
అది ఇకపై యాజమాన్యం కాదు; జీవితకాల సంబంధంగా మారింది. భారతదేశం కూడా ఇందుకు భిన్నం కాదు. వారు తమ సొంత ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో, జెన్ జెడ్ వారి పెంపుడు జంతువుల ఆరోగ్యం, పోషణపైనా అంతే శ్రద్ధ చూపుతున్నారు.
పెంపుడు జంతువుల సంరక్షణలో నాయకులుగా, మా పోర్ట్ఫోలియోలోని ప్రతి ఉత్పత్తి పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా 100% సంపూర్ణ, సమతుల్య పోషణను అందిస్తుంది.

పోషకాహారానికి మించి, పెంపుడు జంతువుల యజమానులకు ఉండే సవాళ్లను తగ్గించడం, ఆ జంతువులకు మంచి ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యం. పెంపుడు జంతువుల కోసం మెరుగైన నగరాలను నిర్మించడం, నేషనల్ అడాప్షన్ వీకెండ్స్ నిర్వహించడం, కీలక మెట్రోలలో మొబైల్ షెల్టర్లను మోహరించడం, పలు నగరాల్లో జంతు సంక్షేమ సంస్థలతో భాగస్వామ్యం వంటి మా కార్యక్రమాలు ఈ ప్రయోజనం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం” అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా, మార్స్ పెట్కేర్ వారి సర్వే పెంపుడు జంతువుల యాజమాన్యంలో ఇలాంటి ధోరణులను వెల్లడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో 56% మంది పెంపుడు జంతువుల యజమానులుగా ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది తొలిసారి పెంచుకుంటున్నారు.
ప్రపంచ పెంపుడు జంతువుల యజమానులలో సుమారు 37% మంది వాటిని తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చూస్తారు. ప్రజలు, పెంపుడు జంతువుల మధ్య ఈ లోతైన బంధం సరిహద్దులకు అతీతంగా విస్తరించి ఉంది.
ఇలాంటి విషయాలతో మార్స్ పెట్కేర్ ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానుల అవసరాలను తీర్చడానికి తన ఆఫర్లను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ, నవీకరిస్తుంది.