ఇకపై ప్రతి నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 31,2025: గత ప్రభుత్వ హయాంలో పేదలకు అందించే రేషన్ సరుకుల పంపిణీని చౌక ధరల దుకాణాల మూతతో నిలిపివేసి, ఇంటింటికి సరఫరా చేస్తామంటూ రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినా, వాటిని నెలలో 1-2 రోజులే జంక్షన్లలో నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో పేద ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక, రోజువారీ పనులు వదిలి, చిన్నచిన్న ఉపాధి వదిలి, సరుకుల కోసం వేచి ఉండాల్సి వచ్చేది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 31,2025: గత ప్రభుత్వ హయాంలో పేదలకు అందించే రేషన్ సరుకుల పంపిణీని చౌక ధరల దుకాణాల మూతతో నిలిపివేసి, ఇంటింటికి సరఫరా చేస్తామంటూ రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినా, వాటిని నెలలో 1-2 రోజులే జంక్షన్లలో నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో పేద ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక, రోజువారీ పనులు వదిలి, చిన్నచిన్న ఉపాధి వదిలి, సరుకుల కోసం వేచి ఉండాల్సి వచ్చేది.

దీనితో పాటు, రేషన్ బియ్యం, ఇతర సరుకుల అక్రమ రవాణా కేసులు బయటపడ్డాయి. ఈ విషయం పై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుబడింది. ఈ పరిస్థితిని అరికట్టడానికి, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు సమయానికి అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెడుతోంది.

ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇది రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి సరుకులు సులభంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Read This also…India Now Competes with the US and China: Chandrababu Naidu

అంతేకాకుండా, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవంతంగా అమలవుతుందనే నమ్మకమున్నది.

About Author