అల్లూరిలో అడవితల్లి బాట ప్రారంభించిన పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం, ఏప్రిల్ 7,2025:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం, ఏప్రిల్ 7,2025:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామానికి వెళ్లారు.
Read this also…Tonbo Imaging Secures Rs.175 Crore in Series D Pre-IPO Round to Advance Next-Gen Defense Technologies
ఇది కూడా చదవండి...భారతదేశంలో నెం.1 కమర్షియల్ ఈవీ తయారీదారుగా మహీంద్రా MLMMLఎల్5 విభాగంలో 37.3% మార్కెట్ వాటా..
గిరిజన ప్రాంత అభివృద్ధే లక్ష్యం
ఈ పర్యటనలో భాగంగా గిరిజన గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చే “అడవితల్లి బాట” కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పెదపాడు గ్రామంలో శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

Read this also…Mahindra Last Mile Mobility Emerges as India’s No.1 Electric Commercial Vehicle Maker in FY25
విమానాశ్రయంలో ఘన స్వాగతం
విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి శాసన సభ్యుడు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ నేతలు డా. సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, బోడపాటి శివదత్, భీశెట్టి వసంత లక్ష్మి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.