రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 25, 2025: రూపాయి మారకం రేటు క్షీణత గడిచిన కొన్ని రోజులుగా ఆగిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కొంత స్థాయికి బలపడింది. ఇది

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 25, 2025: రూపాయి మారకం రేటు క్షీణత గడిచిన కొన్ని రోజులుగా ఆగిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కొంత స్థాయికి బలపడింది. ఇది ఆర్థిక రంగ విశ్లేషకులకు ఊరటనిచ్చే పరిణామం. అయితే, రూపాయి విలువ తగ్గడం కొత్త విషయం కాదు.

1947లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ.3.30 ఉండగా, 1980 నాటికి రూ.7.8కి పడిపోయింది. 1990లో రూ.17.01గా నమోదవగా, 2000 నాటికి రూ.43.50కి తగ్గిపోయింది. 2010లో రూ.46గా ఉండగా, 2020 నాటికి రూ.71కు చేరింది. 2021 నుంచి మారకం రేటు మరింత పెరిగి తాజాగా రూ.87కు చేరింది.

రూపాయి పతనం – ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

రూపాయి విలువ తగ్గడం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా ఇది వివాదాస్పద అంశంగా మారింది. ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తున్నా, గత దశాబ్దాలుగా రూపాయి విలువ తగ్గినా దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందింది. రూపాయి పతనమంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్టు అనుకోవడం తప్పు. అంతర్జాతీయ మార్కెట్ ఒరవడిని బట్టి మారకం రేటు మారుతూ ఉంటుంది.

ఇది కూడా చదవండి..హోండా మోటార్‌సైకిల్‌ సంస్థ రహదారి భద్రతపై అవగాహన

ఇది కూడా చదవండి..45శాతం పట్టణవాసులకు కుటుంబంతోనే ఆనందం.. ఎల్ జీ సర్వేలో వెల్లడి..

రూపాయి విలువ తగ్గితే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఎగుమతుల పెరుగుదలతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఐటీ సేవల కంపెనీలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ చేయడానికి ఇది ఉపయుక్తంగా మారుతుంది. అంతేకాదు, రూపాయి విలువ తగ్గడం వల్ల విదేశీయుల పర్యాటక ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో, విదేశీ విద్య, పెట్రోల్, బంగారం వంటి దిగుమతుల ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పడుతుంది.

అంతర్జాతీయ పరిణామాలు & రూపాయి ప్రభావం

అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలపై సుంకాలను విధించడం వంటి అంశాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. పోటీతత్వాన్ని కొనసాగించడానికి రూపాయి విలువ తగ్గించుకోవడం అవసరమవుతుంటుంది. దీన్ని మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అన్వయించుకుంటే, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా మారుతుంది. చైనా వంటి దేశాలు ఉద్దేశపూర్వకంగా తమ కరెన్సీ విలువ తగ్గించడం ద్వారా ఎగుమతులను పెంచుకున్న ఉదాహరణలు ఉన్నాయి.

అదే సమయంలో, అర్జెంటీనా వంటి దేశాలు కరెన్సీ విలువ తగ్గింపుతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 2001-2002లో పెసో విలువ అకస్మాత్తుగా పడిపోవడంతో భారీ ద్రవ్యోల్బణం నెలకొంది. కాబట్టి, కరెన్సీ విలువ తగ్గించడాన్ని సరైన సమయానికి, సరైన విధానంతో నిర్వహించుకోవాలి.

రూపాయి మారకం రేటుపై ఆందోళన అక్కర్లేదు

రూపాయి మారకం రేటును రాజకీయ సమస్యగా మార్చడం కాకుండా, ఆర్థిక విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనుకున్నదానికంటే ఎక్కువగా రూపాయి విలువ పడిపోయిన సందర్భాలు అరుదు. కాబట్టి, ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసే చర్యలపై దృష్టిపెట్టడం మంచిది.

About Author