హోరాహోరీగా ఏఐటీఏ టెన్నిస్ పోరు.. ముగిసిన నీలపు సింహాచలం మెమోరియల్ టోర్నీ..
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,(స్పోర్ట్స్ డెస్క్)హైదరాబాద్, మార్చి 28,2026: హైదరాబాద్ నగరంలోని విజయ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ‘నీలపు సింహాచలం మెమోరియల్’ ఏఐటీఏ (AITA
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,(స్పోర్ట్స్ డెస్క్)హైదరాబాద్, మార్చి 28,2026: హైదరాబాద్ నగరంలోని విజయ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ‘నీలపు సింహాచలం మెమోరియల్’ ఏఐటీఏ (AITA) ఛాంపియన్షిప్ సిరీస్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ముగిసింది.
యూ-12, యూ-14 విభాగాల్లో గత ఐదు రోజులుగా (మార్చి 23-27) జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న వర్ధమాన క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. ఫైనల్స్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
Read this also:Hyderabad Braces for Rockstar Anirudh’s “XV” Concert: Essential Travel & Entry Guide
Read this also:Flipkart’s “Ugadi vs Yugadi” Campaign Brings Festive Deals Through Interactive Game..
బాలికల విభాగం..
బాలికల యూ-12 సింగిల్స్ ఫైనల్లో పర్విత వి అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలవగా, ప్రిషా వికాస్ రన్నరప్తో సరిపెట్టుకుంది. యూ-14 సింగిల్స్లో అనీక్ష ఆర్.జి టైటిల్ కైవసం చేసుకోగా, అథర్వ పి రన్నరప్గా నిలిచింది. ఇక యూ-14 డబుల్స్ విభాగంలో అథర్వ పి – వర ఎ.సి జంట విజేతలుగా నిలవగా, నిషిత – వర్షిణి జోడీ రన్నరప్గా నిలిచింది.
బాలుర విభాగం..

బాలుర యూ-12 సింగిల్స్ టైటిల్ను యశవర్ధన్ ఆర్.ఎస్ సొంతం చేసుకోగా, రయాన్ రన్నరప్గా నిలిచాడు. యూ-14 సింగిల్స్ ఫైనల్లో సహస్రద్ ఆర్.డి విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు, మాన్విక్ కె రన్నరప్గా నిలిచాడు. డబుల్స్ విభాగంలో అక్షజ్ పద్మ – సాయి సహస్రద్ జంట విజేతలుగా నిలవగా, ఇషాన్ – సాయి సహర్ష్ జోడీ రన్నరప్తో సరిపెట్టుకుంది.
దివంగత నీలపు సింహాచలం జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ టోర్నీ, గ్రాస్ రూట్ స్థాయిలో టెన్నిస్ క్రీడను ప్రోత్సహించడానికి ఒక చక్కని వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెషనల్ కోర్టుల నడుమ జరిగిన ఈ పోటీల్లో చిన్నారులు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు.