కాకినాడ కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఘాటైన దుర్గంధం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ కృష్ణయ్య, కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావులతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, పరిశ్రమ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు పీసీబీ అధికారులు పరిశీలనలు ప్రారంభించారు. ప్రాథమికంగా పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల అవుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మరింత లోతైన తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.