బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,జనవరి 22,2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,జనవరి 22,2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన మూడో రోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ జరగనుంది.

ఈ సందర్భంగా, యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా వంటి ప్రముఖ సంస్థల సీఈఓలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

అలాగే, దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ – పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అలాగే, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు.

About Author