ఈనెల 18న ఏపి పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన గన్నవరం సమీపంలో కృష్ణా జిల్లాలో
![](https://varahimedia.com/wp-content/uploads/2025/01/AmitShah.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన గన్నవరం సమీపంలో కృష్ణా జిల్లాలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF),ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను ప్రారంభించనున్నారు.
అమిత్ షా శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఆ రాత్రి, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/01/AmitShah.jpg)
అనంతరం ఆయన విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు.
19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రారంభోత్సవం అనంతరం, అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.