అడవితల్లి బాటతో గిరిజన గ్రామాలకు అభివృద్ధి బాట: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డుంబ్రిగూడ, ఏప్రిల్ 7,2025: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డుంబ్రిగూడ, ఏప్రిల్ 7,2025: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ముఖ్యోద్దేశంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ఆయన భూమిపూజ చేసి బీటీ రోడ్ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాలకు మరింత మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించాం. రహదారులు, డ్రైనేజీ, పాఠశాలలు, తాగునీటి సదుపాయాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అన్నారు.
రెండు కోట్లు విలువైన రహదారి పనులకు భూమిపూజ
చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ.2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ రోడ్డుతో గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కలుగనుందని అధికార వర్గాలు తెలిపాయి.

“మా దేవుడు గ్రామానికి వచ్చాడు” – హర్షం వెల్లివిరిసిన గిరిజనులలో
పెదపాడులో అడవితల్లి బాట ప్రారంభ వేడుకకు వచ్చిన పవన్ కళ్యాణ్కు గిరిజనులు సంప్రదాయబద్ధంగా హారతులతో, కోది భాష పాటలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి...అల్లూరిలో అడవితల్లి బాట ప్రారంభించిన పవన్ కళ్యాణ్
Read this also…Tonbo Imaging Secures Rs.175 Crore in Series D Pre-IPO Round to Advance Next-Gen Defense Technologies
12 సమస్యలు.. ఆరు నెలల్లో పరిష్కారం హామీ
స్థానిక మహిళ మాధురి (మ్యాగీ) వినతి పత్రం ద్వారా గ్రామస్థుల 12 సమస్యలను వినిపించగా, వాటిని ఆరు నెలల్లో పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు. రహదారులు, బ్రిడ్జ్, పాఠశాల, అంగన్వాడీ భవనం, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, హెల్త్ క్లినిక్, సెల్ టవర్ వంటి సదుపాయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పవన్
గ్రామంలో ఉన్న అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న మినీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. వారికి పుస్తకాలు, స్వీట్లు ఇచ్చారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.
చాపరాయి గెడ్డపై నడుచుకుంటూ సమస్యలు పరిశీలన
చాపరాయి గెడ్డపై నడుస్తూ ప్రజల నుంచి బ్రిడ్జి పునర్నిర్మాణ అంశంపై వినతులు స్వీకరించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కోదీ భాషలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి
పెదపాడులో గిరిజనుల కోది భాషలో స్వాగతం పలకగా, పవన్ కళ్యాణ్ కూడా అదే భాషలో ప్రసంగించారు. తమ సమస్యలను గుర్తించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అడ్డాకులతో కుట్టిన గిరిజనుల ప్రత్యేక టోపీని ధరించి వారితో మమేకమయ్యారు.
ఇది కూడా చదవండి...భారతదేశంలో నెం.1 కమర్షియల్ ఈవీ తయారీదారుగా మహీంద్రా MLMMLఎల్5 విభాగంలో 37.3% మార్కెట్ వాటా..
Read this also…Mahindra Last Mile Mobility Emerges as India’s No.1 Electric Commercial Vehicle Maker in FY25
పర్యటనలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, అటవీశాఖ అధికారులు, జనసేన నేతలు గంగులయ్య, చెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.