పట్టణ భారతీయుల ఆరోగ్యంపై ‘ఐవా’ సంచలన నివేదిక: అర్ధరాత్రి భోజనాలతో అనర్థమే!
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 18,2026: పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయుల జీవక్రియ ఆరోగ్యం (మెటబాలిక్ వెల్నెస్) తీవ్ర సంక్షోభంలో పడిందని ప్రముఖ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 18,2026: పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయుల జీవక్రియ ఆరోగ్యం (మెటబాలిక్ వెల్నెస్) తీవ్ర సంక్షోభంలో పడిందని ప్రముఖ టచ్-ఆధారిత మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ సంస్థ ‘ఐవా’ (EYVA) హెచ్చరించింది.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, పని ప్రదేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం, తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ లేకపోవడం వంటి లోపభూయిష్టమైన జీవనశైలి పట్టణవాసుల పాలిట శాపంగా మారుతోందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షల రీడింగ్ల ఆధారంగా రూపొందించిన ‘ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026’ నివేదికను ఐవా విడుదల చేసింది.
జాతీయ అలవాటుగా మారిన ‘ఆలస్యపు భోజనాలు’ దేశవ్యాప్తంగా 54 శాతం మంది రాత్రి 9 గంటల తర్వాతే భోజనం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. దీనివల్ల వారి ప్రామాణిక స్థాయిలతో పోలిస్తే నిద్ర నాణ్యత తగ్గడంతో పాటు, మరుసటి రోజు ఉదయం గ్లూకోజ్ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతున్నట్లు నివేదిక గుర్తించింది.
Read this also:EYVA Report Highlights India’s Wellness Crisis..
ఇదీ చదవండి:భారత్లో వార్షిక మొత్తం విక్రయాల్లో 1 బిలియన్ డాలర్ను అధిగమించిన అమెజాన్ నౌ..
కుటుంబంలో ఒకరు ఆలస్యంగా వచ్చినా, మిగతావారు కూడా దానికి అనుగుణంగా తమ భోజన సమయాలను మార్చుకుంటున్నారు. అయితే, ఒకే రకమైన ఆహారం తీసుకున్నా.. ఇద్దరి శరీరాలపై అది చూపే ప్రభావం వేర్వేరుగా ఉంటోందని నివేదిక పేర్కొంది.
‘మెటబాలిక్ హ్యాంగోవర్’ అంటే.. నిద్రకు ఆరు గంటల ముందు సుమారు 40% మంది కెఫిన్ తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఐవా వ్యవస్థాపకుడు, సీఈఓ సునీల్ మదికట్ల మాట్లాడుతూ.. “ఆరోగ్య స్కోర్లు పడిపోవడానికి ఒకే కారణం ఉండదు. అనేక జీవనశైలి లోపాలు ఒకదానిపై ఒకటి పేరుకుపోయి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
రాత్రి ఆలస్యంగా అధిక మోతాదులో భోజనం చేయడం, నిద్రకు ముందు కెఫిన్ తీసుకోవడం, ఒత్తిడి వంటివన్నీ కలిసి రాత్రంతా హృదయ స్పందన రేటును పెంచుతాయి. మరుసటి రోజు ఉదయం జీవక్రియ స్కోర్లను దెబ్బతీస్తాయి. దీన్నే మేం ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ అంటున్నాం” అని వివరించారు.
ఇదీ చదవండి:జావా ఆల్ స్టార్స్ ‘సిల్వర్ నైట్’ విజేతగా స్టావ్రౌలా..
నగరాల వారీగా ఆరోగ్య ధోరణులు చూస్తే..
- హైదరాబాద్: ఇక్కడ ఉద్యోగుల్లో ఏకంగా 64% మంది రాత్రి 10 గంటల తర్వాతే తమ చివరి భోజనం చేస్తున్నారు. దీంతో ఉదయం గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి, జీవక్రియ స్కోర్లు పడిపోయి ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ బారిన పడుతున్నారు.
- ఢిల్లీ-ఎన్సీఆర్: వాయు కాలుష్యం (AQI) కారణంగా శీతాకాలంలో బహిరంగ వ్యాయామాలు 30% తగ్గాయి. వెల్నెస్ స్కోర్లు 6-9% పడిపోయాయి. ఇక్కడ ప్రజలు అత్యంత ఆలస్యంగా, అధిక మోతాదులో భోజనం చేస్తుండటంతో రక్తపోటు సమస్యలు ఎక్కువగా నమోదయ్యాయి.
- ముంబయి: 52% మంది లోకల్ రైళ్లు, ప్రజా రవాణాను ఆశ్రయిస్తున్నా.. రద్దీ వల్ల పగటిపూట తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ కూడా 64% మంది రాత్రి 9:30 తర్వాతే తింటున్నారు.
- బెంగళూరు: 44% మంది సుదీర్ఘ ప్రయాణాలతో కదలిక లేని (Sedentary) జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల వారి శారీరక శ్రమ 18% మేర తగ్గింది.

చిన్న మార్పులతో పెను ప్రయోజనం జీవనశైలిలో చేసుకునే చిన్న మార్పులు ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని సర్వే స్పష్టం చేసింది. భోజనం తర్వాత చిన్నపాటి నడక వల్ల 37% మందిలో గ్లూకోజ్ స్థాయిలు 12-16% మేర అదుపులోకి రావడమే కాకుండా నిద్ర మెరుగుపడింది.
రాత్రి త్వరగా తినడం, కొద్దిసేపు నడవడం, కెఫిన్ వాడకం తగ్గించడం వంటి కనీస మార్పులు పాటించిన వారి వెల్నెస్ స్కోర్లు మూడు నెలల వ్యవధిలో 8-12% పెరిగాయని ఐవా నివేదిక వెల్లడించింది.