సుధీర్ బాబు హీరోగా‘జటాధర’ చిత్రం ప్రారంభం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 18,2025: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కేఆర్. బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా నవ దళపతి సుధీర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 18,2025: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కేఆర్. బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా నవ దళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్లో వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖులైన దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Read this also...Magellanic Cloud Accelerates AI-Led Growth, Expands Operations in Telangana
ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్. బన్సాల్ మాట్లాడుతూ, “జటాధర చిత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు విభిన్న అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్లో మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించడమే మా లక్ష్యం,” అన్నారు.

‘జటాధర’ చిత్రం కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఆ ఆలయంలోని సంపద, దానికన్నా పెద్దగా ఉండే వివాదాలు, చరిత్ర, పురాణాల చుట్టూ సాగుతుండబోతుంది.
ఈ చిత్రంలో స్వామి ఆలయ చరిత్ర, దాని చుట్టూ ఏర్పడిన కథలు, పూర్వకాలపు గాధల గురించి విపులంగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోంది.
Read this also...Bank of India Raises Rs.2,690 Crore through 10-Year Infrastructure Bonds at 7.50% Interest
ఇది కూడా చదవండి..మాజిల్లానిక్ క్లౌడ్ టెక్నాలజీ విస్తరణ.. తెలంగాణలో భారీ పెట్టుబడులు
ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జటాధర’లో నిధి కోసం పోరాటం సాగుతూనే, ఆ పోరాటంలో కొన్ని శాపాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ శాపాలు ఏమిటి? పోరాటం ఎలా జరుగుతుంది? అన్న దాని గురించి మరికొన్ని నెలల తర్వాత జ్ఞానాన్ని పొందేందుకు ఎదురు చూడాల్సిందే.