దివంగత పారిశ్రామిక దిగ్గజం జీపీ హిందూజాకు ఘన నివాళి: ముంబైలో ప్రార్థనా సమావేశం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,డిసెంబర్ 19,2025: హిందూజా గ్రూప్ దివంగత చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (జీపీ హిందూజా) జ్ఞాపకార్థం ముంబైలో ఏర్పాటు చేసిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,డిసెంబర్ 19,2025: హిందూజా గ్రూప్ దివంగత చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (జీపీ హిందూజా) జ్ఞాపకార్థం ముంబైలో ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. డిసెంబర్ 16, 2025న నిర్వహించిన ఈ కార్యక్రమంలో హిందూజా కుటుంబ సభ్యులు, సన్నిహితులు,వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ప్రముఖులు..
ఈ సంస్మరణ సభకు భారత పారిశ్రామిక రంగానికి చెందిన దిగ్గజాలతో పాటు, రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు అగ్రనేతలు, దౌత్యవేత్తలు,సినీ ప్రముఖులు హాజరయ్యారు. పరమార్థ నికేతన్‌కు చెందిన స్వామి చిదానంద సరస్వతి వంటి ఆధ్యాత్మిక వేత్తలు జీపీ హిందూజాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమాజంపై ఆయన చూపిన ప్రభావం చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రార్థనా సమావేశంలో ప్రముఖ గాయకులు అనురాధ పౌడ్వాల్, నితిన్ ముఖేష్ ,మోహిత్ లాల్వానీ తమ గాత్రంతో నివాళులర్పించారు. జీపీ హిందూజాకు ఎంతో ఇష్టమైన భజనలతో పాటు, ఆయన ఆప్తమిత్రుడు దివంగత రాజ్ కపూర్‌పై చిత్రీకరించిన క్లాసిక్ గీతాలను వారు ఆలపించారు. ఈ పాటలు సభలో ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేశాయి.

అంకితభావం కలిగిన నాయకత్వం
హిందూజా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టడంలో జీపీ హిందూజా చేసిన కృషిని వక్తలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వ్యాపారవేత్తగానే కాకుండా, మానవతావాదిగా ఆయన అందించిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.

About Author