గదిలోని ఫ్యాన్‌ను నియంత్రించే ‘స్మార్ట్’ ఏసీలు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,మార్చి 25,2026: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు సరికొత్త కూలింగ్ అనుభూతిని అందించేందుకు గోద్రెజ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,మార్చి 25,2026: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు సరికొత్త కూలింగ్ అనుభూతిని అందించేందుకు గోద్రెజ్ అప్లయన్సెస్ సిద్ధమైంది. 2026 వేసవి సీజన్ కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎయిర్ కండిషనర్ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో భాగంగా ‘స్మార్ట్ సింక్’ అనే సరికొత్త సాంకేతికతను దేశీ మార్కెట్లోకి పరిచయం చేసింది.

Read this also:Hyderabad Braces for Rockstar Anirudh’s “XV” Concert: Essential Travel & Entry Guide

Read this also:Flipkart’s “Ugadi vs Yugadi” Campaign Brings Festive Deals Through Interactive Game..

ఈ కొత్త ఏసీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి వై-ఫై ద్వారా గదిలోని ఫ్యాన్‌తో అనుసంధానమవుతాయి. వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని ఏసీయే స్వయంగా నియంత్రిస్తుంది. దీనివల్ల అర్ధరాత్రి ఫ్యాన్ వేగం మార్చుకోవడానికి నిద్ర లేవాల్సిన అవసరం ఉండదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఐఓటీ ఆధారితమైన ఈ ఏసీల ద్వారా విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడంతో పాటు, ఫిల్టర్ క్లీనింగ్ అలర్ట్‌లు, స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ వంటి సదుపాయాలను పొందవచ్చు.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఒక టన్ను నుంచి 4 టన్నుల సామర్థ్యం వరకు వివిధ రకాల మోడళ్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్ప్లిట్, క్యాసెట్, టవర్, విండో ఏసీలు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఇయాన్ మాగ్నస్’, ‘ఇయాన్ నింబస్’, ‘ఇయాన్ రెగాలిస్’ వంటి ప్రీమియం సిరీస్‌లను ఆకర్షణీయమైన రంగుల్లో (గ్లాస్ బ్లాక్, మ్యాట్ సిల్వర్, షాంపైన్ గోల్డ్) ప్రవేశపెట్టింది.

40% అమ్మకాల వృద్ధి..
ఈ సందర్భంగా గోద్రెజ్ అప్లయన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది ఏసీ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, గోద్రెజ్ మాత్రం మెరుగైన వృద్ధిని సాధించింది. మా అధునాతన ప్రొడక్ట్ లైనప్, 5 ఏళ్ల సమగ్ర వారంటీ, విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ వేసవిలో 30 నుంచి 40 శాతం అమ్మకాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు. ఏఐ ఆధారిత హెవీ డ్యూటీ కూలింగ్‌తో పాటు, గది అంతటా చల్లదనం ఇచ్చే ‘4-వే స్వింగ్’ ఫీచర్ ఈ ఏసీల ప్రత్యేకత అని సంస్థ ఏసీ ప్రొడక్ట్ గ్రూప్ హెడ్ సబ్యసాచి గుప్తా పేర్కొన్నారు. సులభమైన ఈఎంఐలు, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా ఇవి మార్కెట్లో లభించనున్నాయి.

About Author