కర్నూలులో ప్యూర్ ఈవీ షోరూమ్ ప్రారంభం
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నూలు, మార్చి 29,2025: ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ ఇంధన పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఈవీ, ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను

వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నూలు,మార్చి 29,2025: ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ ఇంధన పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఈవీ, ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ కర్నూలులో కొత్త షోరూమ్ను ప్రారంభించింది. ఈ షోరూమ్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం రేంజ్ ఉత్పత్తులను ప్రదర్శించేలా దీన్ని అభివృద్ధి చేశారు. pureev.in
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి టీ.జీ. భరత్ మాట్లాడుతూ, “కర్నూలులో ప్యూర్ ఈవీ కొత్త షోరూమ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ అనుకూల వాహనాల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్ వాహనాలను సమకూర్చడం మంచి పరిణామం” అని పేర్కొన్నారు.

ప్యూర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ వదేరా మాట్లాడుతూ, “ఈ షోరూమ్ ద్వారా ప్రజలకు సులభంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతో పాటు, పర్యావరణ హితమైన ట్రాన్స్పోర్టేషన్ను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం” అన్నారు.
ఇది కూడా చదవండి...చందానగర్లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్ను ప్రారంభించిన సూపర్స్టార్ నాగార్జున
Read this also…SMFG India Credit raises USD 175 MN via ECB from Standard Chartered Bank & CTBC Bank
ప్యూర్ ఈవీ తాజాగా ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది గృహాలు, వాణిజ్య సంస్థలు, గ్రిడ్లకు ఉపయోగపడేలా రూపకల్పన చేయబడింది. కంపెనీ ప్రస్తుత స్థితిలో భారతదేశంలో టాప్ 10 ఈవీ 2 వీలర్ తయారీదారులలో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు 1 లక్ష టన్నుల కర్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడింది.
ప్యూర్ ఈవీ ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిలో
- ePluto 7G MAX
- ePluto 7G
- ecoDryft 350
- ETRANCE Neo+
- eTryst X

శ్రేణి వాహనాలు ఉన్నాయి. అలాగే, హోమ్, కమర్షియల్, గ్రిడ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను కూడా కంపెనీ అందిస్తోంది.
ప్రతిష్టాత్మక వృద్ధి ప్రణాళికలో భాగంగా, ప్యూర్ ఈవీ రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్షిప్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ దేశవ్యాప్తంగా 320కి పైగా అవుట్లెట్లను ఏర్పాటు చేయనుంది.
కర్నూలులో ప్యూర్ ఈవీ షోరూమ్ ప్రారంభంతో స్థానిక వినియోగదారులకు అధునాతన విద్యుత్ వాహనాలను అందించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్లో హరిత ట్రాన్స్పోర్టేషన్కు బలమైన మద్దతుగా నిలవనుంది. pureev.in